యాప్నగరం

శీతోష్ణస్థితి మార్పులతో ఏటా బిలియన్ డాలర్ల నష్టం

వాతావరణంలో మార్పుల వల్ల ఇండియా ఏటా 9 బిలియన్ డాలర్లు మూల్యం చెల్లించుకుంటోందని, అంతేకాదు వ్యవసాయ ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుందని కేంద్ర వ్యవసాయ శాఖ పేర్కొంది.

TNN 18 Aug 2017, 2:37 pm
వాతావరణంలో మార్పుల వల్ల ఇండియా ఏటా 9 బిలియన్ డాలర్లు మూల్యం చెల్లించుకుంటోందని, అంతేకాదు వ్యవసాయ ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుందని కేంద్ర వ్యవసాయ శాఖ పేర్కొంది. ఇది 2020 నుంచి ఈ శతాబ్దం చివరినాటికి నాటికి మరింత అధికమవుతుందని పార్లమెంటరీ కమిటికి ఇటీవల సమర్పించిన నివేదికలో తెలిపింది. అలాగే ప్రధాన పంటల ఉత్పాదకత తర్వాత కొద్ది సంవత్సరాలు పరిమితంగా ఉంటుంది, కానీ వాతావరణంలో మార్పులకు అనుగుణంగా సేద్యం చేస్తే తప్ప 2100 నాటికి 10 నుంచి 40 శాతం పెరుగుదల సాధ్యం కాదని తెలిపింది.
Samayam Telugu india loses 10 billion every year to climate change report
శీతోష్ణస్థితి మార్పులతో ఏటా బిలియన్ డాలర్ల నష్టం


కొన్నేళ్లుగా గోధుమ, వరి, నూనె గింజలు, పప్పుధాన్యాలు, పండ్లు, కూరగాయల దిగుబడిలో తగ్గుదల కనిపిస్తోందని, వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయాన్ని చేయకపోతే రైతులు నష్టపోయి పేదలుగా మారుతారని పేర్కొంది. దిగుబడి హెచ్చుతగ్గులను అధిగమించడానికి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల విధానాన్ని అనుసరించాలి. పొరుగు దేశం చైనాతో పోల్చుకుంటే ఇది ప్రత్యేకంగా భారతీయ వ్యవసాయ రంగ ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. శీతోష్ణస్థితిలో మార్పుల వల్ల ప్రధానంగా నూనె గింజలు, పప్పులు, పాలను కూడా దిగుమతి చేసుకునే ప్రమాదం పొంచి ఉంది. 2016-17లో ఊహించిన ఉత్పత్తి కంటే 2030 నాటికి అదనంగా మరో 70 మిలియన్ టన్నుల ఆహారధాన్యాల అవసరమవుతాయి.

ఆర్థిక సర్వే మధ్యంతర నివేదిక ప్రకారం శీతోష్ణస్థితిలో మార్పుల మూలంగా భారత్ ఏడాదికి 9 నుంచి 10 బిలియన డాలర్లు నష్టపోతుంది. వీటిలో సుమారు 80 శాతం ఉత్పత్తులు బీమా సౌకర్యం లేనివే ఉన్నాయి. అలాగే 2014లో సంభవించిన కశ్మీర్ వరదలు వల్ల 15 బిలియన్ డాలర్లు, హుద్‌హుద్ తుఫాన్ వల్ల 11 బిలియన్ డాలర్లు నష్టం వాటిల్లింది. వాతావరణ మార్పుల మూలంగా భవిష్యత్తులో ఇలాంటి నష్టాలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. తీవ్ర వాతావరణ పరిస్థితులకు ఎల్లప్పుడూ శీతోష్ణస్థితి మార్పులతో సంబంధం ఉండదు... కానీ తరచూ పెరుగుతున్న తీవ్రత కారణంగా పతనం తప్పదని పరిశోధనలో తేలింది.

దేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి ఎక్కువ లేదా తక్కువై సాధారణంగా కొనసాగితే పెరుగుతున్న ఉష్ణోగ్రత, వర్షపాతంలో అసమానతలు పెద్ద మొత్తంలో నష్టాన్ని కలిగిస్తాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ అధికారులు పేర్కొన్నారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎకనమిక్స్ అండ్ పాలసీ రిసెర్చ్ అంచనా ప్రకారం 2030 నాటికి 345 మిలియన్ టన్నుల ఆహారపదార్థాలు అవసరమవుతాయి. 2011 కంటి ఇది 30 శాతం అదనం. పండ్లు, కూరగాయలు, పాలు, జంతు ఉత్పత్తులు (మాంసం, గుడ్లు, చేపలు), పంచదార, వంట నూనెలకు 2011తో పోల్చుకుంటే 2030 నాటికి రెండు నుంచి మూడు రెట్లు డిమాండ్ అధికంగా ఉంటుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.