యాప్నగరం

పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో గెలాక్సీ ఎస్8

దక్షిణ కొరియా దిగ్గజ ఎలక్ట్రానిక్స్ కంపెనీ సామ్సంగ్ నుంచి వస్తున్న మరో ప్రీమియమ్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్8.

TNN 24 Feb 2017, 2:13 pm
దక్షిణ కొరియా దిగ్గజ ఎలక్ట్రానిక్స్ కంపెనీ సామ్సంగ్ నుంచి వస్తున్న మరో ప్రీమియమ్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్8. భారత్‌లో ఉన్న మొబైల్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఫోన్ ఇది. భారీ అంచనాలున్న ఈ ఫోన్ గురించి రోజుకొక విషయం బయటికి వస్తోంది. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లకు వాడుతున్న ప్రాసెసర్లను గెలాక్సీ ఎస్8లో సామ్సంగ్ వాడలేదట. దీనిలో కొత్త ప్రాసెసర్‌‌ను ఉపయోగిస్తున్నారట.
Samayam Telugu india may get samsung galaxy s8 smartphone with this mobile processor
పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో గెలాక్సీ ఎస్8


ఎక్సీనాస్ 9 పేరుతో తరవాతి తరం ప్రాసెసర్ సిరీస్‌ను సామ్సంగ్ ఇటీవల విడుదల చేసింది. ఈ ప్రాసెసర్లను సామ్సంగ్ స్వయంగా అభివృద్ధి చేసింది. మొదటిగా తయారుచేసిన ఎక్సీనాస్ 9 సిరీస్ 8895 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఇప్పుడు గెలాక్సీ ఎస్8లో వినియోగిస్తున్నారు. ఇది 10 నానోమీటర్ చిప్‌సెట్. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 14 నానోమీటర్ చిప్‌సెట్ కంటే ఇది 27 శాతం అధిక వేగంతో పనిచేస్తుంది. అంతేకాకుండా 40 శాతం తక్కువ బ్యాటరీ పవర్‌ను తీసుకుంటుంది.

దీంతో గెలాక్సీ ఎస్8, గెలాక్సీ ఎస్8 ప్లస్ స్మార్ట్‌ఫోన్ల ద్వారా సామ్‌సంగ్ తొలిసారి ఈ చిప్‌సెట్‌ను ప్రయోగిస్తుంది. ఈ కొత్త ప్రాసెసర్‌తో వచ్చే ఫోన్లు భారత మార్కెట్‌లో లభించునున్నాయి. అయితే క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్‌తో ఇప్పటికే సామ్సంగ్ గెలాక్సీ ఎస్8 ప్రొడక్షన్ ప్రారంభించిందట. ఈ ఫోన్లను అమెరికా మార్కెట్‌లో విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.