యాప్నగరం

సముద్ర గర్భంలో నిగూఢ అంశాల జాడ గుర్తించే దిశగా..

ఒకే ప్రయోగం ద్వారా 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపి ప్రపంచ దేశాలకు సవాల్ విసిరిన భారత శాస్త్రవేత్తలు.. ఇప్పుడు సముద్ర గర్భంలోనూ అణువణువూ గాలించడానికి..

TNN 5 Aug 2017, 4:58 pm
అంతరిక్షంలో వరస విజయాలతో సత్తా చాటుతున్న భారత్.. సముద్ర గర్భంలో నిగూఢ అంశాల జాడ కనుగొనే దిశగా కొత్త అన్వేషణకు ప్రయత్నాలు ప్రారంభిస్తోంది. చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓసియన్ టెక్నాలజీ (ఎన్‌ఐవోటీ)కి చెందిన శాస్త్రవేత్తల బృందం.. సముద్ర గర్భంలోకి దూసుకెళ్లే మానవసహిత సబ్‌మెర్సిబుల్ నిర్మాణానికి డిజైన్ సిద్ధం చేసింది. కేంద్రం నుంచి అనుమతి లభిస్తే దీన్ని అయిదేళ్లలో అందుబాటులోకి తీసుకురానున్నారు. దీని నిర్మాణానికి రూ. 500 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు.
Samayam Telugu india prepares to dive deep into the sea with manned craft
సముద్ర గర్భంలో నిగూఢ అంశాల జాడ గుర్తించే దిశగా..


సముద్ర జలాల్లోకి దూసుకెళ్లే సూపర్ ఎయిర్‌క్రాఫ్ట్‌గా అభివర్ణిస్తున్న ఈ సబ్‌మెర్సిబుల్‌ .. 6 కిలోమీటర్ల లోతు వరకూ శాస్త్రవేత్తలను తీసుకెళ్లగలుగుతుంది. వాళ్లు వివిధ కోణాల్లో పరిశీలనలు జరిపి సముద్ర జలాల అంతర్భాగంలో నిగూడమై ఉన్న విలువైన ఖనిజాలు, ఇంధనాల జాడ కనిపెడతారు. ఇప్పటివరకూ అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, జపాన్ దేశాలకు మాత్రమే ఈ సాంకేతికత అందుబాటులో ఉంది.

ఒకే ప్రయోగం ద్వారా 104 ఉపగ్రహాలను, అత్యంత బరువైన శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపి ప్రపంచ దేశాలకు సవాల్ విసిరిన భారత శాస్త్రవేత్తలు.. ఇప్పుడు సముద్ర గర్భంలోనూ అణువణువూ గాలించడానికి సిద్ధమవుతున్నారు. అంతరిక్షంలోకి మానవసహిత యాత్రకు కసరత్తు చేస్తున్న తరుణంలోనే.. సముద్ర గర్భంలోకి మానవసహిత యంత్రాలను పంపించడానికి రూపకల్పన చేస్తుండటం గమనార్హం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.