యాప్నగరం

నేవీ చరిత్రలో తొలిసారిగా తేలియాడే ఓడరేవు!!

భారత నౌకదళ చరిత్రలో తొలిసారిగా తేలియాడే ఓడరేవును నిర్మించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఈ ఓడరేవును ఎల్ అండ్ టీ సంస్థ చేపట్టింది.

TNN 21 Jun 2017, 12:34 pm
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన నీటిలో తేలియాడుతూ ప్రయాణించే ఓడరేవును తమిళనాడులో ప్రారంభించారు. తమిళనాడు కట్టుపల్లిలోని లార్సెన్ అండ్ టుబ్రో లిమిటెడ్ నిర్మించిన ఈ పోర్టును భారత యుద్ధనౌకల తయారీ విభాగం కంట్రోలర్ వైస్ అడ్మిరల్ డీఎం దేశ్ పాండే సతీమణి అంజలీ దేశ్ పాండే పూజలు చేసి జాతికి అంకితం చేశారు. 55 వేల చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ ఓడరేవు సముద్రంలో ప్రయాణిస్తూ, అవసరమైన చోట ఆగి యుద్ధ నౌకలకు ఆశ్రయం ఇస్తుంది. అంతే కాదు ఇది 8 వేల టన్నుల బరువున్న సరుకులతో ప్రయాణించి వాటిని వివిధ నౌకల్లోకి ఎక్కించగలుగుతుంది.
Samayam Telugu indias first indigenously built floating dock goes on stream
నేవీ చరిత్రలో తొలిసారిగా తేలియాడే ఓడరేవు!!


ఈ ఫ్లోటింగ్ డాక్ అందుబాటులోకి రావడం నౌకాదళ చరిత్రలో ఓ మైలురాయని, దీనిపై నౌకల మరమ్మతులు సైతం చేసుకోవచ్చని రక్షణ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. దీన్ని నేవీకి అప్పగించే ముందు కొన్ని ట్రయల్స్ నిర్వహించనున్నట్లు లార్సెన్ అండ్ టుబ్రో షిప్‌బిల్డింగ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ మాజీ వైస్ అడ్మిరల్ బి కన్నన్ తెలిపారు. భారత ప్రాదేశిక జలాల్లో అండమాన్ నికోబార్ తీరం మధ్య ప్రయాణించే నౌకలకు అవసరమైన సేవలను ఇది అందిస్తుందని ఆయన అన్నారు. రూ.468 కోట్ల వ్యయంతో 185 మీటర్ల పొడవు, 40 మీటర్ల వెడల్పు ఉండే ఈ కృత్రిమ ఓడరేవు నిర్మాణం రక్షణ శాఖ ఆదేశాలతో ఎల్‌అండ్ టీ 2015లో ప్రారంభించింది. అనుకున్న సమయానికి పూర్తి చేశామని ఆ సంస్థ అధ్యక్షుడు ఎస్ ఎన్ సుబ్రహ్మణ్యం వెల్లడించారు. కట్టుపల్లి కేంద్రంగా నౌకాదళం, తీర ప్రాంత గస్తీ దళానికి చెందిన నౌకలను ఎల్ అండ్ టీ తరచూ మరమ్మత్తులు చేస్తుందని, ఇటీవలే ఆరు నౌకలను వర్క్‌షాప్ నుంచి పంపందని వీటిలో అతిపెద్ద సరుకు రవాణా నౌక ఐఎన్ఎస్ జ్యోతి కూడా ఉన్నట్లు ఆయన తెలియజేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.