యాప్నగరం

రవిశాస్త్రి ఇంత ముఖ్యమైంది మర్చిపోతే ఎలా?

ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ ముగిశాక.. రవిశాస్త్రి కీలక అవార్డును ప్రకటించడం మర్చిపోయాడు.

TNN 13 Apr 2017, 2:10 pm
ముంబై: బుధవారం వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ ముగిసిన అనంతరం ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ముంబై జట్టు సునాయాసంగా మ్యాచ్‌ను గెలిచాక అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ముందుగా ముంబై జట్టు కెప్టెన్ రోహిత్ శర్మను పిలిచి మాట్లాడిన రవిశాస్త్రి తర్వాత బెస్ట్ క్యాచ్ అందుకున్న ఆటగాడిగా పార్థీవ్ పటేల్‌ పేరును ప్రకటించాడు. అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా మృణాల్ పాండ్యను, స్టయిలిష్ ప్లేయర్‌గా హర్భజన్ సింగ్‌ను ప్రకటించడంతో వాళ్లిద్దరూ వచ్చి అవార్డులను అందుకున్నారు.
Samayam Telugu ipl 2017 ravi shastri forgets to announce man of the match award during mumbai indians vs sunrisers hyderabad
రవిశాస్త్రి ఇంత ముఖ్యమైంది మర్చిపోతే ఎలా?


కానీ కీలకమైన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ను ప్రకటించడం మాత్రం మర్చిపోయాడు. ఈ మ్యాచ్‌లో 24 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసిన జస్ప్రీత్ బుమ్రా ధాటికి హైదరాబాద్ జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది. 2016లో టీ20ల్లోకి అడుగుపెట్టిన బుమ్రా.. బుధవారం నాటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్ పరుగులు చేయకుండా అడ్డుకొని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ప్రకటించని విషయాన్ని కాసేపయ్యాక గుర్తించిన రవిశాస్త్రి తప్పు సరిదిద్దుకొని బుమ్రాను పిలిచాడు.

రవిశాస్త్రి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ప్రకటించడాన్ని మర్చిపోవడం ఇదే తొలిసారి కాదు. 2015లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై థ్రిల్లింగ్ విక్టరీని సొంతం చేసుకుంది. అందుకుంది. 8 బంతుల్లోనే 12 పరుగులు చేసిన హార్ధిక్ పాండ్య మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌కు ఎంపికయ్యాడు. కానీ అతడి పేరును ప్రకటించడం మాత్రం రవిశాస్త్రి మర్చిపోయాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.