యాప్నగరం

ISRO సాయం: ఇ-వెహికల్స్ మరింత చీప్!

అధునాతన సాంకేతికతతో ప్రపంచాన్నే అబ్బురపరుస్తున్న ISRO.. త్వరలో పర్యవరణానికి మేలు చేసే ఇ-వెహికల్స్ (బ్యాటరీతో నడిచే వాహనాలు) అభివృద్ధికి చేయూతనివ్వనుంది. తక్కువ ఖర్చు, తేలికపాటి బ్యాటరీల తయారీకి సంబందించిన సాంకేతికత అంశాలను బ్యాటరీ మ్యానుఫాక్చర్స్ సంస్థలకు అందించనుంది. ఈ మేరకు.....

TNN 9 Apr 2017, 11:51 am
ధునాతన సాంకేతికతతో ప్రపంచాన్నే అబ్బురపరుస్తున్న ISRO.. త్వరలో పర్యవరణానికి మేలు చేసే ఇ-వెహికల్స్ (బ్యాటరీతో నడిచే వాహనాలు) అభివృద్ధికి చేయూతనివ్వనుంది. తక్కువ ఖర్చు, తేలికపాటి బ్యాటరీల తయారీకి సంబందించిన సాంకేతికత అంశాలను బ్యాటరీ మ్యానుఫాక్చర్స్ సంస్థలకు అందించనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ISROతో సంప్రదింపులు జరుపుతోంది. శ్రీహరికోటలో గల విక్రం సారాభాయి స్పేస్ సెంటర్‌లో ఆటోమొబైల్, ఇ-వెహికల్స్‌కు అవసరమైన హైపవర్ బ్యాటరీలను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది.
Samayam Telugu isro will allow companies to obtain lithium ion battery tech
ISRO సాయం: ఇ-వెహికల్స్ మరింత చీప్!


లీథియం అయాన్ పనిచేసే ఈ ఇ-వెహికిల్స్‌‌ నిర్వహణ ఖర్చు చాలా తక్కువ. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాధారణ బ్యాటరీలతో పోల్చితే లీథియం ఐయాన్ బ్యాటరీలు చాలా తేలికగా ఉండటంతోపాటు తక్కువ ప్లేసులోనే వాటిని ఏర్పాటు చేయవచ్చు. పైగా, వీటిని చార్జింగ్ చేయడం కూడా ఎంతో సులభం.

టువంటి బ్యాటరీల తయారీ కోసం మహింద్ర రినౌల్ట్, హుందయ్, నిస్సాన్, టాటా మోటార్స్, హై ఎనర్జీ బ్యాటరీస్, బీహెచ్ఈఎల్, ఇండియన్ ఆయిల్ సంస్థలు ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రభుత్వ బ్యాటరీ తయారీ సంస్థలు ఈ సాంకేతికత కోసం ఇస్రోను సంప్రదించాయి. ఈ నేపథ్యంలో కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఇస్రో సాయం కోసం సంప్రదింపులు జరిపారు. భారత వినియోగదారులకు అందుబాటు ధరల్లో ఇ-వెహికల్స్‌ను అందించేందుకు సహకరించాలని కోరారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. బీహెచ్ఈఎల్ త్వరలో ఈ బ్యాటరీల తయారీ కోసం ఇస్రోతో ఒప్పందం చేసుకోనుంది.

కాలుష్య నియంత్రణలో భాగంగా కేంద్రం ఇటువంటి వాహనాలను ఎక్కువ సంఖ్యలో మార్కెట్‌లోకి విడుదల చేయాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం లీథియం అయాన్‌ బ్యాటరీలను చాలా ఎక్కువ ధరలను చెల్లించి విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఈ మేరకు లీథియం అయాన్ బ్యాటరీలను తక్కువ ధరకే లభించేలా, ప్రైవేటు తయారీ సంస్థలకు వీటిని అందుబాటులోకి తెచ్చేలా ఫ్రేమ్‌వర్క్ రూపొందించాలని కేబినెట్ సెక్రటరీ.. ఇస్రోకి సూచించారు. ఇది కార్యరూపం దాల్చితే.. తక్కువ ధరకే హైపవర్ బ్యాటరీ వెహికల్స్ అందుబాటులోకి రావడంతోపాటు ఇంధన ఖర్చులు కూడా తగ్గుతాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.