యాప్నగరం

AWES Teacher Recruitment: భారీ సంఖ్యలో టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. సుమారు 2000 కు పైగా ఖాళీలు..? అర్హతలు, ఎంపిక విధానం ఇలా

Army Public School Recruitment 2022: దేశవ్యాప్తంగా మొత్తం 136 ఆర్మీ పబ్లిక్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణ కోసం ఆర్మీ వెల్ఫేర్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ పేరుతో ప్రత్యేక విభాగాన్ని సైతం నెలకొల్పారు.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 23 Sep 2022, 3:46 pm

ప్రధానాంశాలు:

  • ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌ రిక్రూట్‌మెంట్‌ 2022
  • భారీ సంఖ్యలో టీచర్‌ పోస్టుల భర్తీ
  • అక్టోబర్‌ 5 దరఖాస్తులకు చివరితేది

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Army Public School Teacher Recruitment 2022
AWES Army Public School Teacher Recruitment 2022: దేశ వ్యాప్తంగా ఉన్న మిలటరీ కంటోన్మెంట్స్, మిలటరీ స్టేషన్స్‌ పరిధిలో.. మొత్తం 136 ఆర్మీ పబ్లిక్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణ కోసం ఆర్మీ వెల్ఫేర్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ పేరుతో ప్రత్యేక విభాగాన్ని సైతం నెలకొల్పారు. ప్రతి ఏటా ఆయా క్లస్టర్ల పరిధిలో ఏర్పడే ఖాళీలకు సంబంధించి ఈ సొసైటీ పోస్ట్‌ల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపడుతుంది. తాజాగా 2023-24లో ఏర్పడే ఖాళీలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సొసైటీ నిర్వహించే రాత పరీక్షలో మార్కుల ఆధారంగా.. ఆయా క్లస్టర్లలోని పాఠశాలలు వేర్వేరుగా విడుదల చేసే నియామక నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని క్లస్టర్లు, పాఠశాలలను పరిగణనలోకి తీసుకుంటే.. 2000కు పైగా ఖాళీలు భర్తీ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
అర్హతలు
  • ప్రైమరీ టీచర్స్‌: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల డీఈడీ ఉండాలి.బీఈడీ ఉత్తీర్ణులు కూడా ఈ పోస్ట్‌లకు అర్హులే. వీరు ఉద్యోగంలో చేరిన రెండేళ్లలోపు ఆరు నెలల వ్యవధిలోని పీడీపీఈటీ/ఎన్‌సీటీఈ నిర్వహించే బ్రిడ్జ్‌ కోర్సులో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
  • టీజీటీ: కనీసం యాభై శాతం మార్కులతో డిగ్రీతోపాటు సంబంధిత సబ్జెక్ట్‌తో బీఈడీ ఉత్తీర్ణత ఉండాలి.
  • పీజీటీ: యాభై శాతం మార్కులతో సంబంధిత స్పెషలైజేషన్‌తో పీజీ ఉత్తీర్ణత ఉండాలి. దీంతోపాటు అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే పోస్ట్‌లకు సంబంధించిన సబ్జెక్ట్‌తో బీఈడీ ఉత్తీర్ణులవ్వాలి.
  • పీజీటీ కంప్యూటర్‌ సైన్స్‌ సబ్జెక్ట్‌కు సంబంధించి సీఎస్‌ఈ/ఐటీ బ్రాంచ్‌తో బీటెక్‌/ పీజీ డిప్లొమా ఇన్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌/ఎమ్మెస్సీ(కంప్యూటర్‌ సైన్స్‌)/బీఎస్సీ -కంప్యూటర్‌సైన్స్‌/బీసీఏతోపాటు పీజీ డిగ్రీ ఉత్తీర్ణత/పీజీ డిప్లొమా ఇన్‌ కంప్యూటర్‌ అండ్‌ పీజీ డిగ్రీ ఉండాలి.
  • ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ సబ్జెక్ట్‌కు సంబంధించి.. బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ తత్సమాన కోర్సు ఉత్తీర్ణతతోపాటు, ఎన్‌సీటీఈ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంపీఈడీ ఉత్తీర్ణులవ్వాలి.
  • మిగిలిన అన్ని సబ్జెక్ట్‌లకు సంబంధించి.. సదరు సబ్జెక్ట్‌లో పీజీతోపాటు బీఈడీ ఉత్తీర్ణతను నిర్దేశించారు.
  • విద్యార్హతలతోపాటు సీటెట్‌ లేదా టెట్‌లో అర్హత సాధించి ఉండాలి. తొలి దశ రాత పరీక్ష సమయానికి టెట్‌/సీటెట్‌ రాయని వారు కూడా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. అలాంటి వారు తుది నియామకం సమయానికి సీటెట్‌/టెట్‌ ఉత్తీర్ణత సాధించాలి.
  • వయసు: తాజా గ్రాడ్యుయేట్లకు ఏప్రిల్‌ 1, 2023 నాటికి 40ఏళ్లలోపు, పని అనుభవం ఉన్న వారికి 57 ఏళ్లలోపు ఉండాలి.
మూడు దశల ఎంపిక ప్రక్రియ
ఆర్మీ పబ్లిక్‌ స్కూల్స్‌లో.. పీఆర్‌టీ, టీజీటీ, పీజీటీ పోస్ట్‌ల భర్తీకి సంబంధించి నిర్వహించే ప్రక్రియ మొత్తం మూడు దశలుగా ఉంటుంది. తొలి దశలో అభ్యర్థులకు పోస్ట్‌ల వారీగా ఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు.

Railway Jobs: రైల్వేలో క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.. పూర్తి వివరాలివే
ముఖ్య తేదీలు
  • ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్‌ 5, 2022
  • అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌ సదుపాయం: అక్టోబర్‌ 20, 2022
  • ఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ తేదీలు: నవంబర్‌ 5, నవంబర్‌ 6,2022
  • ఫలితాల వెల్లడి: నవంబర్‌ 20, 2022
  • పర్సనల్‌ ఇంటర్వ్యూ, కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌: జనవరి/ఫిబ్రవరి2023లో జరిగే అవకాశం.
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.awesindia.com/

దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.