యాప్నగరం

Coal India Jobs: బీటెక్‌, బీఈ విద్యార్థులకు 1050 ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.1,60,000 వరకూ జీతం.. పూర్తి వివరాలివే

Coal India 1050 Management Trainee Jobs: కోల్‌ ఇండియా లిమిటెడ్‌ (Coal India Limited) భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 1050 మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ (Management Trainee) పోస్టులను భర్తీ చేయనుంది.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 21 Jun 2022, 2:25 pm

ప్రధానాంశాలు:

  • కోల్‌ ఇండియా జాబ్‌ రిక్రూట్‌మెంట్‌ 2022
  • 1050 మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ పోస్టుల భర్తీ
  • జూన్‌ 23 నుంచి దరఖాస్తులు ప్రారంభం

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Coal India Jobs
Coal India Limited Recruitment 2022 for 1050 Management Trainee Jobs: భారత ప్రభుత్వ బోగ్గు మంత్రిత్వశాఖకు చెందిన కోల్‌ ఇండియా లిమిటెడ్‌ (Coal India Limited) భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 1050 మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ (Management Trainee) పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులను గేట్‌-2022 స్కోర్‌ ద్వారా భర్తీ చేయనుంది. కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ (ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. అర్హత, ఆసక్తిగల వారు అన్‌లైన్‌ విధానంలో జూన్‌ 23 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. జులై 22 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.coalindia.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

Rail Kaushal Vikas Yojana: 10వ తరగతి పాసైతే చాలు.. రైల్వేలో ఉచిత శిక్షణ.. ఉద్యోగ అవకాశం.. ఈ లింక్‌ ద్వారా అప్లయ్‌ చేసుకోండి
  • పోస్టులు: మేనేజ్‌మెంట్‌ ట్రెయినీలు
  • మొత్తం ఖాళీలు: 1050

విభాగాల వారీగా ఖాళీలు: 1050
  • మైనింగ్‌- 699 పోస్టులు
  • సివిల్‌- 160 పోస్టులు
  • ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్- 124 పోస్టులు
  • సిస్టమ్‌ అండ్‌ ఈడీపీ- 67 పోస్టులు

Agneepath Notification: అగ్నిపథ్‌ నోటిఫికేషన్‌ విడుదల.. విద్యార్హతలు, వయసు తదితర పూర్తి వివరాలివే
ముఖ్య సమాచారం:
  • అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ (ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణులై ఉండాలి.
  • వయసు: 31.05.2022 నాటికి 30 ఏళ్లు మించకుండా ఉండాలి.
  • జీతభత్యాలు: నెలకు రూ.50,000 - 1,60,000 చెల్లిస్తారు.
  • ఎంపిక విధానం: సంబంధిత సబ్జెక్టుల్లో సాధించిన వాలిడ్‌ గేట్‌-2022 మెరిట్‌ స్కోర్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తు ఫీజు: జనరల్‌/ ఓబీసీ అభ్యర్థులు రూ.1180 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
  • దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జూన్ 23, 2022
  • దరఖాస్తులకు చివరి తేది: జులై 22, 2022
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.coalindia.in/

నోటిఫికేషన్‌:

coal-india-21.06.2022
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.