యాప్నగరం

Hyderabad ECIL లో ఉద్యోగాలు.. BTech, BE వారికి మాత్రమే.. ట్రైనింగ్‌లోనే రూ.54,880 జీతం

ECIL Hyderabad GET Recruitment 2022: ఈసీఐఎల్‌ ఈ నోటిఫికేషన్‌ ద్వారా 40 గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈసీఈ, మెకానికల్‌, సీఎస్‌ఈ తదితర విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 23 Apr 2022, 6:03 pm

ప్రధానాంశాలు:

  • ఈసీఐఎల్‌ జాబ్‌ రిక్రూట్‌మెంట్‌ 2022
  • గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ట్రెయినీ జాబ్స్‌
  • మే 14 దరఖాస్తులకు చివరితేది

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ఈసీఐఎల్‌ జాబ్‌ రిక్రూట్‌మెంట్‌ 2022
ECIL Hyderabad Recruitment 2022: భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన.. హైదరాబాద్‌ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ECIL) పలు ఉద్యోగాల భర్తీకి సంబంధించి జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 40 గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈసీఈ, మెకానికల్‌, సీఎస్‌ఈ తదితర విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. మే 14 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://careers.ecil.co.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.
పోస్టు పేరు: గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ట్రెయినీ
  • మొత్తం ఖాళీలు: 40
  • ఈసీఈ- 21
  • మెకానికల్‌- 10
  • సీఎస్‌ఈ- 9

TSPSC Group 1 Notification 2022: గుడ్‌న్యూస్‌.. నేడే తెలంగాణ గ్రూప్‌ –1 నోటి‌ఫి‌కే‌షన్‌ విడు‌ద‌ల..?
ముఖ్య సమాచారం:
  • అర్హతలు: పోస్టులను బట్టి సంబంధిత విభాగం నుంచి కనీసం 60 శాతం మార్కులతో బీటెక్‌/బీఈ పూర్తి చేసి ఉండాలి. వీటితో పాటు గేట్‌-2022 వ్యాలిడ్‌ స్కోర్‌ కలిగి ఉండాలి.
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఎంపిక ప్రక్రియ: గేట్‌- 2022 స్కోర్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • జీతం: ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ సమయంలోనే రూ.54,880 చెల్లిస్తారు.
  • దరఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్‌ 23, 2022
  • దరఖాస్తులకు చివరితేది: మే 14, 2022
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://careers.ecil.co.in/

HPCL Technician Recruitment 2022: విశాఖపట్నం హెచ్‌పీసీఎల్‌ సంస్థలో 186 ఉద్యోగాలు.. నెలకు రూ.55,000 జీతం
హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (HPCL) టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా విశాఖపట్నం రిఫైనరీలో 186 ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి కలిగిన వారు మే 21వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక ఉంటుంది.

పూర్తి వివరాలకు, అప్లయ్‌ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి:
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.