యాప్నగరం

India Post GDS Recruitment 2022: టెన్త్‌ పాసైన మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాలు.. 38,296 పోస్టులు.. మహిళలు కూడా అర్హులే

indiapostgdsonline.gov.in: దేశవ్యాప్తంగా ఉన్న పోస్ట్ ఆఫీసుల్లో (Post Office Jobs) గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 38,926 పోస్టులను భర్తీ చేయనుంది.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 15 May 2022, 5:23 pm

ప్రధానాంశాలు:

  • ఇండియా పోస్ట్‌ జీడీఎస్‌ రిక్రూట్‌మెంట్‌
  • 38,926 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల
  • కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ఇండియా పోస్ట్‌ జీడీఎస్‌ రిక్రూట్‌మెంట్
India Post 38926 Gramik Dak Sevak posts: ఇండియా పోస్ట్ భారీగా ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న పోస్ట్ ఆఫీసుల్లో (Post Office Jobs) గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 38,926 పోస్టులను భర్తీ చేయనుంది. వీటిలో గ్రామీణ డాక్ సేవక్ (Gramin Dak Sevak) పోస్టులతో పాటు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) పోస్టులున్నాయి. ఇక.. తెలంగాణలో 1226, ఆంధ్రప్రదేశ్‌లో 1716 పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. జూన్ 5 దరఖాస్తులకు చివరి తేదీ.
అర్హతలు- ఎంపిక విధానం:
పదవ తరగతి పాసైనవారంతా ఈ పోస్టులకు అప్లయ్‌ చేసుకోవచ్చు. ఇండియా పోస్ట్ ఈ ఖాళీలను మెరిట్ ద్వారా ఎంపిక చేస్తోంది. ఎలాంటి ఎగ్జామ్ ఉండదు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పదవ తరగతిలో వచ్చిన మార్కుల్ని పరిగణలోకి తీసుకొని మార్కుల మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

రాష్ట్రాల వారీగా ఖాళీల వివరాలు: 38,926
  • ఆంధ్రప్రదేశ్- 1716
  • తెలంగాణ- 1226
  • అస్సాం- 1143
  • బీహార్- 990
  • ఛత్తీస్‌గఢ్ - 1253
  • ఢిల్లీ- 60
  • గుజరాత్- 1901
  • హర్యానా- 921
  • హిమాచల్ ప్రదేశ్- 1007
  • జమ్మూ కశ్మీర్- 265
  • జార్ఖండ్- 610
  • కర్ణాటక- 2410
  • కేరళ- 2203
  • మధ్యప్రదేశ్- 4074
  • మహారాష్ట్ర- 3026
  • పంజాబ్- 969
  • రాజస్థాన్- 2890
  • తమిళనాడు- 4810
  • ఉత్తర ప్రదేశ్- 2519
  • ఉత్తరాఖండ్- 353
  • పశ్చిమ బెంగాల్- 1963

ముఖ్య సమాచారం:
  • విద్యార్హతలు: 10వ తరగతి పాసై ఉండాలి. స్థానిక భాషలో 10వ తరగతి వరకు చదివి ఉండాలి.
  • వయస్సు: 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్‌వుమెన్‌కు ఫీజు లేదు.
  • వేతనం: బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‌కు రూ.12,000, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000.
  • ఎంపిక విధానం: టెన్త్‌ క్లాస్‌ మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • సబ్‌మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్: 10వ తరగతి మెమో, ఫోటో, సంతకం.
  • దరఖాస్తులు ప్రారంభం: మే 2, 2022
  • దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 5, 2022
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://indiapostgdsonline.gov.in/

అప్లయ్‌ చేయడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.