యాప్నగరం

SSC JE 2022: బీటెక్‌, డిప్లొమా చేసిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు.. జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

Staff Selection Commission: జూనియర్‌ ఇంజినీర్‌ (JE) పోస్టుల నియాక ప్రక్రియకు సంబంధించి స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ (SSC) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 16 Aug 2022, 8:21 am

ప్రధానాంశాలు:

  • ఎస్‌ఎస్‌సీ జేఈ రిక్రూట్‌మెంట్‌ 2022
  • జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన
  • సెప్టెంబర్‌ 2 దరఖాస్తులకు చివరితేది
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu SSC JE Recruitment 202
SSC JE Recruitment 2022: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న జూనియర్‌ ఇంజినీర్‌ (JE) పోస్టుల నియాక ప్రక్రియకు సంబంధించి స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ (SSC) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అర్హులైన వారు సెప్టెంబర్‌ 2 వరకు ఆన్‌లైన్‌లో అప్లయ్‌ చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు సంబంధించి రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. సివిల్‌, మెకానికల్‌, ఎలక్రికల్‌, క్వాలిటీ సర్వేయింగ్‌ అండ్‌ కాంట్రాక్ట్స్‌ డిసిప్లెయిన్స్‌ విభాగాల్లో ఈ పోస్టులు ఉన్నాయి. అయితే ఖాళీల సంఖ్యను నియామక బోర్డు వెల్లడించలేదు. పరీక్ష సమయానికి ఎన్ని పోస్టులు ఉన్నాయనే అంశాన్ని ప్రకటించే అవకాశం ఉంది.

Telangana: తెలంగాణలో 5111 అంగన్‌వాడీ ఉద్యోగాల భర్తీ.. కేబినెట్ ఆమోదం.. త్వరలో నోటిఫికేషన్‌ విడుదల..!
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
  • సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌: జూనియర్‌ ఇంజినీర్‌ సివిల్‌, మెకానికల్‌
  • సీపీడబ్లూడీ: సివిల్‌, ఎలక్ట్రికల్‌
  • ఎంఈఎస్‌, బార్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌: జేఈ సివిల్‌, మెకానికల్‌ అండ్‌ మెకానికల్‌
  • సెంట్రల్‌ వాటర్‌ పవర్‌ రిసెర్చ్‌ స్టేషన్‌: జేఈ మెకానికల్‌, సివిల్‌, ఎలక్ట్రికల్‌
  • డైరెక్టరేట్‌ ఆఫ్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌: జేఈ మెకానికల్‌, ఎలక్ట్రికల్‌
  • ఫరక్కా బ్యారేజ్‌ ప్రాజెక్టు: జేఈ సివిల్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌
  • నేషనల్‌ టెక్నికల్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌: ఎలక్ట్రికల్‌, మెకానికల్‌ పోస్టులు ఉన్నాయి.

ముఖ్య సమాచారం:
  • అర్హతలు: సంబంధిత విభాగంలో బీటెక్‌ లేదా డిప్లొమా చేసి ఉండాలి.
  • వయసు: అభ్యర్థులు 30 ఏళ్ల లోపు వయస్సు కలిగినవారై ఉండాలి.
  • ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. మొత్తం రెండు పేపర్లు ఉంటాయి.
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • అప్లికేషన్‌ ఫీజు: రూ.100, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
  • దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్‌ 2, 2022
  • రాత పరీక్ష: నవంబర్‌ నెలలో ఉంటుంది.
  • వెబ్‌సైట్‌: https://ssc.nic.in/
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.