యాప్నగరం

'పోస్టల్' ఉద్యోగాల రిజిస్ట్రేషన్‌కు నేడే ఆఖరు

India Post Recruitment 2019 | ఏపీ, తెంగాణ పోస్టల్ సర్కిళ్లలో గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీ కోసం పదోతరగతి అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి..

Samayam Telugu 14 Nov 2019, 8:33 am
తెలుగు రాష్ట్రాల్లో పోస్టల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు గడువు గురువారం (నవంబరు 14) ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. నవంబరు 21 వరకు ఆన్‌లైన్ దరఖాస్తుకు అవకాశం ఉంది. అభ్యర్థులు నిర్ణీత మొత్తంలో ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోసుకోవచ్చు. పదోతరగతి అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మెరిట్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు ఉంటాయి.
Samayam Telugu postal jobs


RRB Jobs: సౌత్ సెంట్రల్ రైల్వేలో 4103 ఖాళీలు
ఓసీ/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు ఫీజు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. మిగతా వారికి ఫీజు నుంచి మినహాయింపు ఉంది. మహిళా అభ్యర్థులకు కూడా ఫీజు నుంచి మినహాయింపు ఉంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసిన వారు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫీజు చెల్లించాల్సినవారు ఆన్‌లైన్ లేదా సంబంధిత పోస్టాఫీసులో చెల్లించవచ్చు.

UPSC Jobs: కేంద్ర కొలువులకు నోటిఫికేషన్ జారీ


ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి మొత్తం 3677 పోస్టుల భర్తీకి పోస్టల్ శాఖ నోటిఫికేషన్లు జారీచేసిన సంగతి తెలిసిందే. అక్టోబరు 14న రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభంకాగా.. అక్టోబరు 22న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం క్లిక్ చేయండి..

ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించడానికి క్లిక్ చేయండి..

ఆన్‌లైన్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..

తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 3677 గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టుల ఉద్యోగాలకు గాను ఏపీ సర్కిల్‌లో 2707 పోస్టులు, తెలంగాణ సర్కిల్‌లో 970 పోస్టులు ఉన్నాయి. పదోతరగతి మార్కుల ఆధారంగా ఉద్యోగ నియామకాలు చేపడతారు.

తెలంగాణ సర్కిల్‌ నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..

ఏపీ సర్కిల్‌ నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..

ముఖ్యమైన తేదీలు..

➥ రిజిస్ట్రేష‌న్, ఫీజు చెల్లింపు తేదీ ప్రక్రియ ప్రారంభం: 15.10.2019

రిజిస్ట్రేష‌న్, ఫీజు చెల్లించడానికి చివరితేది: 14.11.2019

➥ ఆన్‌లైన్ దర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 22.10.2019

➥ ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివరితేది: 21.11.2019.
undefined

Read More..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.