ఏపీలో గ్రామ, వార్డు ఉద్యోగాలు చేస్తున్న వారికి.. వారి సేవలకు గుర్తింపుగా మూడు కేటగిరీల్లో అవార్డులు, నగదు పురస్కారాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మెహన్రెడ్డి నిర్ణయించారు. ఇందులో భాగంగా వారు అందించే సేవలను బట్టి మూడు కేటగిరీలుగా ఎంపిక చేసి.. ఉగాది నుంచి వలంటీర్ల పురస్కారాల కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. శుక్రవారం జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పక్షపాతం, అవినీతికి దూరంగా సేవా దృక్పథాన్ని పెంపొందించే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని స్పష్టం చేశారు.
ఎంపిక ప్రక్రియ ఇలా:
అర్హుల ఎంపిక ప్రక్రియలో భాగంగా.. సచ్ఛీలత, మూడు రోజుల్లోగా పెన్షన్ల పంపిణీ, హాజరు, యాప్ల వినియోగం, నవరత్నాల అమల్లో భాగస్వామ్యం, కోవిడ్ –19 సర్వే తదితర అంశాలు ఎంపికకు ప్రామాణికంగా తీసుకుంటారు.
ఎంపిక ప్రక్రియ ఇలా:
అర్హుల ఎంపిక ప్రక్రియలో భాగంగా.. సచ్ఛీలత, మూడు రోజుల్లోగా పెన్షన్ల పంపిణీ, హాజరు, యాప్ల వినియోగం, నవరత్నాల అమల్లో భాగస్వామ్యం, కోవిడ్ –19 సర్వే తదితర అంశాలు ఎంపికకు ప్రామాణికంగా తీసుకుంటారు.
- 1వ కేటగిరి: ఏడాదిపాటు నిరంతరంగా సేవలు అందించిన వారందరి పేర్లు పరిశీలన చేస్తారు. ఇందులో ఎంపికైన గ్రామ, వార్డు వలంటీర్లకు సేవామిత్ర పురస్కారం, బ్యాడ్జ్, రూ.10 వేల నగదు బహుమతి అందజేస్తారు.
- 2వ కేటగిరి: ప్రతి మండలం, లేదా పట్టణంలో ఐదుగురు చొప్పున వలంటీర్ల ఎంపిక చేస్తారు. వీరికి సేవా రత్న పురస్కారం, స్పెషల్ బ్యాడ్జ్, రూ.20 వేల చొప్పున నగదు బహుమతి అందజేస్తారు..
- 3వ కేటగిరి: ప్రతి నియోజకవర్గంలో ఐదుగురు చొప్పున వలంటీర్ల ఎంపిక చేస్తారు. వీరికి సేవా వజ్రం పేరిట పురస్కారం, స్పెషల్ బ్యాడ్జ్తో పాటు మెడల్, రూ.30 వేల చొప్పున నగదు బహుమతి ఉంటుంది.