యాప్నగరం

Andhra Pradesh : ఏపీలో ఆంగన్‌వాడీ ఉద్యోగాలు.. 10వ తరగతి పాసైన వాళ్లు అర్హులు

AP Anganwadi Recruitment 2023 : ఆంధ్రప్రదేశ్‌- విశాఖపట్నం జిల్లా.. ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో అంగన్‌వాడీ వర్కర్, అంగన్‌వాడీ హెల్ప­ర్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 31 Mar 2023, 10:24 am

ప్రధానాంశాలు:

  • ఏపీ అంగన్‌వాడీ జాబ్‌ రిక్రూట్‌మెంట్‌
  • 47 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల
  • ఏప్రిల్‌ 3 దరఖాస్తులకు చివరితేది

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Andhra Pradesh Govt Jobs
Andhra Pradesh Govt Jobs : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ విశాఖపట్నం జిల్లా.. ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో అంగన్‌వాడీ వర్కర్, అంగన్‌వాడీ హెల్పర్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 47 పోస్టులను భర్తీ చేయనుంది. 10వ తరగతి పాసైన వాళ్లు అప్లయ్‌ చేసుకోవచ్చు. వివరాల్లోకెళ్తే..
మొత్తం పోస్టులు: 47
  • పోస్టుల వివరాలు: అంగన్‌వాడీ వర్కర్‌-05, అంగన్‌వాడీ హెల్పర్‌-42.
  • ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ పేరు: పెందుర్తి, విశాఖపట్నం, భీమునిపట్నం.
  • వయసు: 01.07.2022 నాటికి 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
  • అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
  • వేతనం: అంగన్‌వాడీ వర్కర్‌కు రూ.11,500, మినీ అంగన్‌వాడీ వర్కర్‌కు రూ.7000, అంగన్‌వాడీ హెల్పర్‌కు రూ.7000 జీతం ఉంటుంది.
  • దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును విశాఖపట్నం జిల్లాలోని సీడీపీవో కార్యాలయం చిరునామకు పంపించాలి.
  • దరఖాస్తులకు చివరి తేది: ఏప్రిల్‌ 03, 2023.
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://visakhapatnam.ap.gov.in/

ఏప్రిల్‌ 3 నుంచి ఒంటి పూట బడులు..? ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ మొదటి వారం నుంచి హాఫ్ డే స్కూల్స్ నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్ 3వ తేదీ సోమవారం నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం అవుతాయని తెలుస్తోంది. ఏప్రిల్ చివరి వరకు ఒంటిపూట బడులు కొనసాగించాలన్నది అధికారుల ఆలోచనగా ఉన్నట్లు సమాచారం. అనంతరం మే మొదటి వారం నుంచి సమ్మర్ హాలీడేస్ ఉంటాయని తెలుస్తోంది. ఇక ఒంటి పూట బడులను ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఎండ వేడి ఎక్కువగా ఉంటే.. ఉదయం 7.30 గంటల నుంచి 11.30 వరకు నిర్వహించే అవకాశం ఉంది. ఒకట్రెండు రోజుల్లో ఈ అంశంపై అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది.
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.