యాప్నగరం

AP DSC 2022: ఆంధ్రప్రదేశ్‌లో 502 టీచర్‌ పోస్టుల భర్తీ తాత్కాలికంగా నిలిపివేత.. కారణం ఇదే..!

AP Limited DSC Notification 2022: మొత్తం 502 పోస్టులను లిమిటెడ్‌ డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నట్లు ఇటీవల ఒక ప్రకటనలో వెల్లడింది. అయితే ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా పడింది.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 13 Sep 2022, 1:10 pm
AP DSC Notification 2022: ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ విభాగాల్లో పరిమితంగా ఉపాధ్యాయ పోస్టుల (AP DSC) భర్తీ ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా పడింది. కోర్టు కేసుల వల్ల ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను వాయిదా వేశారు. మొత్తం 502 పోస్టులను లిమిటెడ్‌ డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నట్లు ఇటీవల ఒక ప్రకటనలో వెల్లడింది. స్కూల్‌ అసిస్టెంట్లు, ఎస్‌జీటీ, మ్యూజిక్‌ ఉపాధ్యాయులు, ఆర్ట్‌ ఉపాధ్యాయులు, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ (స్కూల్‌ అసిస్టెంట్స్‌), ఏపీ మోడల్‌ స్కూల్స్‌, బీసీ సంక్షేమ పాఠశాలల్లో పీజీటీ, టీజీటీల నియామకానికి గాను ఈ పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.
Samayam Telugu AP DSC Notification 2022


ఈ పోస్టులకు సంబంధించి ఆగస్టు 25 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అభ్యర్థులు https://apdsc.apcfss.in/ వెబ్‌సైట్‌ ద్వారా ఎప్పటికప్పుడు వివరాలను తెలుసుకోవడంతో పాటు అప్లయ్‌ చేసుకోవచ్చు. విభాగాల వారీగా ఖాళీలను కింది లింక్‌లు క్లిక్‌ చేసి తెలుసుకోవచ్చు.

AP DSC 2022: ఏపీ జెడ్‌పీ, ఎంపీ, మున్సిపల్‌ స్కూళ్లలో 214 టీచర్‌ జాబ్స్‌.. అర్హతలు, ముఖ్యమైన తేదీలు, ఎంపిక ప్రక్రియ ఇలా ఉంటుంది

AP DSC 2022: ఏపీ మోడల్‌ స్కూళ్లలో 207 టీచర్‌ పోస్టులు.. అర్హతలు, ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు విధానం ఇదే

AP IEDSS స్పెషల్ ఎడ్యుకేషన్‌లో 81 స్కూల్‌ అసిస్టెంట్‌ జాబ్స్‌.. జిల్లాల వారీగా ఖాళీలు, అర్హతలు, ముఖ్యమైన తేదీలు ఇవే
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.