యాప్నగరం

AP : 15,000 టీచర్ పోస్టులు.. ఇవి ఇంకా పెరిగే అవకాశం..! త్వరలో..

AP Teacher Jobs : విద్యారంగంలోని ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని.. ఇందులో భాగంగా డీఎస్సీ, లెక్చరర్‌ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినట్టు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 27 Apr 2023, 6:10 pm
AP Teacher Jobs : ఏపీలో విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఇబ్బంది లేకుండా.. వి­ద్యా సంవత్సరానికి అంతరాయం కలగకుండా ఉపాధ్యాయ బదిలీ­లు చేపడతామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఉపాధ్యాయ బది­లీ­లు చేపట్టాలని ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు విజ్ఞప్తులు చేశారని.. బదిలీలను పారదర్శకంగా ఎప్పటికప్పుడు చేపట్టేందుకు విధివిధానాలను రూపొందిస్తున్నట్టు తెలిపారు. సీఎంతో చర్చించి సాధ్యమైనంత త్వరగా విధివిధానాలు ప్రకటిండంతో పాటు.. ఈ విద్యా సంవత్సరంలోనే టీచర్ల బదిలీ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని పేర్కొన్నారు. అలాగే విద్యారంగంలోని ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని.. ఇందులో భాగంగా డీఎస్సీ, లెక్చరర్‌ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. టీచర్ల ఖాళీల లెక్కలు తీస్తున్నామని.. దాదాపు 15,000 పైనే పో­స్టులున్నాయని.. ఇవి ఇంకా పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు.
Samayam Telugu AP Government Jobs


AP Govt Jobs : ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. త్వరలో గ్రూప్‌ 1, 2 నోటిఫికేషన్లు..?

AP DSC : త్వరలో DSC నోటిఫికేషన్‌ విడుదల.. క్లారిటీ ఇచ్చిన మంత్రి
AP DSC Notification 2023 : ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. త్వరలో డీఎస్సీపై ప్రకటన చేస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను అధికారులు సిద్ధం చేస్తున్నారని పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరం (2023-24) నాటికి ఉపాధ్యాయుల బదిలీలు పూర్తి చేస్తామని వెల్లడించారు. అలాగే.. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.

CRPF : 9360 కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. 10వ తరగతి పాసైన వాళ్లు అప్లయ్‌ చేసుకోవచ్చు
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.