ఏపీలో 7000 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం..! పూర్తి వివరాలివే
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న 10,032 వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్లో మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్స్-ఎంఎల్హెచ్పీ నియామకాలను త్వరలో ప్రభుత్వం చేపట్టనుంది.
Samayam Telugu 4 Jun 2021, 3:39 pm
ప్రధానాంశాలు:
- ఏపీలోని నిరుద్యోగులకు గుడ్న్యూస్
- 7 వేల ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్
- వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్లో ఖాళీల భర్తీ
ఏపీ ప్రభుత్వం 7 వేల ఉద్యోగాలను భర్తీ చేయడానికి సిద్ధమవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలను బలోపేతం చేయడమే లక్ష్యంగా 7,000 ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న 10,032 వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్లో మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్స్-ఎంఎల్హెచ్పీ నియామకాలను త్వరలో ప్రభుత్వం చేపట్టనుంది. ఇప్పటికే ఈ క్లినిక్ లలో 2,920 మంది నియామకాలు పూర్తి అయ్యాయి. జాతీయ ఆరోగ్య మిషన్( NHM) నుంచి అనుమతులు రాగానే మిగతా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ నియమకాలతో ప్రతీ కేంద్రంలో ఎంఎల్హెచ్పీ, ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించనున్నారు.
APPSC ద్వారా 8402 ఉద్యోగాల భర్తీ..!
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 8,402 సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇటీవల వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ఈసారి ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇంకా 8,402 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. ఈ ఖాళీలను ఏపీపీఎస్సీకి పంపి క్యాలెండర్ ప్రకారం భర్తీ చేస్తామని మంత్రి చెప్పారు. త్వరలో పూర్తి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే కరోనా కారణంగా ఈ ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా పడింది. పరిస్థితులు చక్కబడ్డాక ఈ పోస్టుల భర్తీపై స్పష్టత రానుంది.
ఏహెచ్ఏ ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్:ఇక.. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 6,099 ఎనిమల్ హజ్బెండరీ అసిస్టెంట్స్ (ఏహెచ్ఏ) పోస్టుల భర్తీకి కూడా సీఎం జగన్ ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వెంటనే రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రారంభించాలని సూచించారు. ఈ ప్రక్రియపై కూడా త్వరలో స్పష్టత రానుంది.
APPSC ద్వారా 8402 ఉద్యోగాల భర్తీ..!
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 8,402 సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇటీవల వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ఈసారి ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇంకా 8,402 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. ఈ ఖాళీలను ఏపీపీఎస్సీకి పంపి క్యాలెండర్ ప్రకారం భర్తీ చేస్తామని మంత్రి చెప్పారు. త్వరలో పూర్తి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే కరోనా కారణంగా ఈ ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా పడింది. పరిస్థితులు చక్కబడ్డాక ఈ పోస్టుల భర్తీపై స్పష్టత రానుంది.
ఏహెచ్ఏ ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్:ఇక.. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 6,099 ఎనిమల్ హజ్బెండరీ అసిస్టెంట్స్ (ఏహెచ్ఏ) పోస్టుల భర్తీకి కూడా సీఎం జగన్ ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వెంటనే రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రారంభించాలని సూచించారు. ఈ ప్రక్రియపై కూడా త్వరలో స్పష్టత రానుంది.