యాప్నగరం

APPSC: ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్‌.. డిపార్ట్‌మెంటల్ టెస్టు 2020 ప్రకటన విడుదల.. తేదీలు ఇవే..!

ప్రభుత్వ ఉద్యోగులకు నిర్వహించే డిపార్టుమెంటల్ టెస్టు-(మే) 2020కు సంబంధించిన ప్రకటన వెలువడింది.

Samayam Telugu 7 Oct 2020, 10:49 am
ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్‌ కోసం నిర్వహించే డిపార్టుమెంటల్ టెస్టు-మే, 2020కు సంబంధించిన ప్రకటన వెలువడింది. ఈ పరీక్షలు రాయాలనుకుంటున్న ఉద్యోగులు ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఒక ప్రకటనలో తెలిపింది. వివరాలు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ https://psc.ap.gov.in/ లో చూడొచ్చు.
Samayam Telugu ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్


ఈనెల 8వ తేదీనుంచి 14వ తేదీవరకు దరఖాస్తు చేయడానికి, ఫీజు చెల్లింపునకు గడువుగా పేర్కొంది. ఇంతకుముందు దరఖాస్తు చేసినవారు మళ్లీ చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. అయితే వారు కొత్త దరఖాస్తుదారులతో పాటు మూడు కేంద్రాలకు ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుందని వివరించింది. పరీక్షల షెడ్యూల్‌ను అక్టోబర్31న విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ పరీక్షలను ఆయా జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్నారు.

పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్‌:

May-2020 Notification -Revised

Must read: ఒకటో తరగతి నుంచే సెమిస్టర్ విధానం.. సిలబస్‌లో పూర్తి మార్పులు..!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.