యాప్నగరం

AP Hostel Welfare Officer: ఏపీ గిరిజన, బీసీ సంక్షేమశాఖలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు

అభ్యర్థులు దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.80 చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 20 వరకు దరకఖాస్తు చేసుకోవచ్చు.

Samayam Telugu 13 Feb 2019, 2:30 pm

ప్రధానాంశాలు:

  • ట్రైబల్, బీసీ సంక్షేమ శాఖలో 28హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్ పోస్టులు
  • ఫిబ్రవరి 27 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu APPSC HWO
ఏపీ గిరిజన, బీసీ సంక్షేమశాఖలో ఖాళీగా ఉన్న హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఏపీపీఎస్సీ) ఫిబ్రవరి 12న నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీతోపాటు, బీఈడీ/డీఎఈడీ అర్హత ఉండి 18-42 సంవత్సరాల మధ్య వయసున్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.80 చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 27 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అభ్యర్థులు మార్చి 19లోగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మార్చి 20 దరఖాస్తుకు చివరితేది.
రెండంచెల రాతపరీక్ష (స్క్రీనింగ్, మెయిన్) ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. స్క్రీనింగ్ పరీక్ష తేదీ వెల్లడించలేదు.. అయితే మెయిన్ పరీక్షను జూన్ రెండో వారంలో నిర్వహిస్తారు. మెయిన్ పరీక్షను ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తుండగా.. స్క్రీనింగ్ పరీక్షను ఆఫ్‌లైన్ ద్వారా నిర్వహించనున్నారు. ఒకవేళ స్క్రీనింగ్ పరీక్ష రాసే అభ్యర్థుల సంఖ్య 25వేలలోపు ఉంటే.. వారికి కూడా ఆన్‌‌లైన్ విధానంలోనే పరీక్ష నిర్వహించనున్నారు.

పోస్టుల వివరాలు..

* హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్: 28 పోస్టులు


అర్హత‌: బ్యాచిల‌ర్ డిగ్రీ, బీఈడీ/ డీఈడీ ఉత్తీర్ణత‌ ఉండాలి.

వయసు: 01.07.2019 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మ‌ధ్య ఉండాలి. 02.07.1977 - 01.07.2001 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.80 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, తెల్లరేషన్ కార్డుదారులకు, నిబంధనల ప్రకారం ఉన్న నిరుద్యోగులకు పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. దరఖాస్తు ఫీజు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఆన్‌లైన్ ద్వారానే ఫీజు చెల్లించాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక‌ విధానం: స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామినేషన్ ద్వారా.

స్కేల్‌పే: రూ.24,440 - రూ.71,510.
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం27.02.2019
ఫీజు చెల్లించడానికి చివరితేది19.03.2019
దరఖాస్తుల సమర్పణకు చివరితేది20.03.2019
స్క్రీనింగ్ పరీక్ష తేదిప్రకటించాల్సి ఉంది.
మెయిన్ పరీక్ష తేదిజూన్ రెండో వారంలో

నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..

వెబ్‌సైట్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.