యాప్నగరం

AP: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డిపార్ట్‌మెంట్‌ పరీక్షల నిబంధనలు సడలింపు

డిపార్ట్‌మెంట్‌ పరీక్షల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Samayam Telugu 25 Sep 2020, 6:55 pm
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల డిపార్ట్‌మెంట్‌ పరీక్షల్లో నెగెటివ్‌ మార్కుల విధానం తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించే శాఖాపరమైన పరీక్షల్లో ఇక నుంచి నెగెటివ్ మార్కింగ్ ఉండబోదని స్పష్టమైన ఆదేశాలు ఇస్తూ.. సాధారణ పరిపాలన శాఖ సర్వీసుల విభాగం ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ ఉత్తర్వులు జారీ చేశారు.
Samayam Telugu ఏపీ ప్రభుత్వం


ఏపీలో 2016 నుంచి ప్రభుత్వం ఉద్యోగుల డిపార్ట్‌మెంట్‌ పరీక్షలలో నెగటివ్ మార్కుల విధానం అమలవుతోంది. ఒక తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కులు కట్ చేస్తున్నారు. దీనితో ఉద్యోగులు డిపార్ట్‌మెంట్‌ పరీక్షలలో పాస్ కావాటం కష్టతరంగా మారింది. పరీక్ష రాస్తున్నవారిలో 10 శాతం కూడా పాస్ అవ్వడం లేదు.

దీనివల్ల చాలామంది ఉద్యోగులు సకాలంలో ఇంక్రిమెంట్, ప్రమోషన్ పొందలేకపోతున్నారు. ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లగా.. నెగటివ్ మార్కుల విధానాన్ని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇకపై జరిగే డిపార్ట్‌మెంట్‌ పరీక్షల్లో ఎక్కువ మంది ఉత్తీర్ణులయ్యే అవకాశం ఉంది.

Must read: జాతీయ ఆరోగ్యమిషన్‌లో 1900 ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే..!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.