యాప్నగరం

TSLPRB Prelims Exam: ఎస్సై, కానిస్టేబుల్ అర్హత మార్కులు తగ్గిస్తాం.. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ కీలక ప్రకటన.. పూర్తి వివరాలివే

TS Police Recruitment 2022: తెలంగాణ పోలీసుశాఖలో 15,644, రవాణాశాఖలో 63, ఆబ్కారీశాఖలో 614 కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నియామకాలకు సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ ను ఆగస్టు 28వ తేదీన నిర్వహించారు.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 12 Sep 2022, 1:43 pm
KCR key comments on Telangana Police Constable SI Cut off Marks: తెలంగాణలో పోలీసు నియామక పరీక్షల్లో కటాఫ్‌ మార్కులు తగ్గించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా పలు సంఘాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఎస్పీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 20 శాతం మార్కులు తగ్గించాలని నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశంపై తాజాగా అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్‌ (KCR) స్పందించారు. రాష్ట్రంలో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాల అర్హత పరీక్షలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కటాఫ్‌ మార్కులు తగ్గించనున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.
Samayam Telugu Telangana Assembly


తెలంగాణ పోలీసుశాఖలో 15,644, రవాణాశాఖలో 63, ఆబ్కారీశాఖలో 614 కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నియామకాలకు సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ ను ఆగస్టు 28వ తేదీన నిర్వహించారు. అనంతరం ప్రిలిమనరీ కీను కూడా విడుదల చేశారు. అయితే దీనిలో 5 ప్రశ్నలకు సంబంధించి సమాధానలను తప్పులుగా ఉన్నట్లు కీలో పేర్కొన్నారు. దీనిపై అభ్యంతరాలను స్వీకరించిన బోర్డు తుది ఫలితాలను వెల్లడించలేదు. ఈ లోపే తమకు అన్యాయం జరిగిందంటూ ఎస్సీ, ఎస్టీ , బీసీ అభ్యర్థులు ఆందోళణ చేపట్టారు.

Dussehra Holidays 2022: స్కూళ్లు, కాలేజీలకు భారీ సంఖ్యలో దసరా సెలవులు.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకంటే..?
కానిస్టేబుల్ అండ్ ఎస్సై పరీక్షలో అభ్యర్థుల యొక్క అర్హత మార్కులను అందరికీ సమానంగా 30 శాతం రావాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అయితే అంతక ముందు నిర్వహించిచ పరీక్షల్లో ఓసీ అభ్యర్థులకు 40 శాతం, బీసీ అభ్యర్థులకు 35 శాతం, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 30 శాతం అర్హత మార్కులు వస్తే.. ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యే వారు.

కానీ ఇటీవల వల విడుదల చేసి నోటిఫికేషన్లో అన్ని క్యాటగిరీల అభ్యర్థులకు 30 శాతం మార్కులు రావాలని పేర్కొన్నారు. అంతే కాకుండా.. ఈ సారి నెగెటివ్ విధానం కూడా తీసుకొచ్చారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. 40 శాతంగా ఉన్న ఓసీ అభ్యర్థులకు 10 శాతం సడలింపు ఇచ్చి, బీసీ అభ్యర్థులకు కూడా 5 శాతం రిజర్వేషన్ సడలింపు ఇచ్చి.. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి సడలింపు ఇవ్వకపోవడంతో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఈ అంశంపై తాజాగా అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్‌ స్పందించారు. రాష్ట్రంలో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాల అర్హత పరీక్షలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కటాఫ్‌ మార్కులు తగ్గించనున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.