యాప్నగరం

TSPSC Group 1 : నా కూతురు కూడా TSPSC Group 1 పరీక్ష రాస్తోంది.. కాబట్టి ఈ పిటిషన్‌ను నేను విచారించలేను

TSPSC Group 1 Prelims : TSPSC Group 1 పరీక్ష వాయిదాతో పాటు.. గ్రూప్ 2, 3, 4 పరీక్షలకు మధ్య రెండు నెలల సమయం ఇవ్వాలని కోరుతూ 36 మంది అభ్యర్థులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 25 May 2023, 2:19 pm
TSPSC Group 1 : తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) జూన్‌ 11న నిర్వహించనున్న TSPSC Group 1 ప్రిలిమ్స్‌ పరీక్షలను వాయిదా వేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్పై విచారణ ప్రారంభమైంది. వేసవి సెలవుల నేపథ్యంలో వెకేషన్ కోర్టులో ఇవాళ ఈ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ కే లక్ష్మణ్.. మధ్యాహ్నం మరో బెంచ్కు పంపిస్తానని పేర్కొన్నారు. తన కుమార్తె కూడా TSPSC Group 1పరీక్ష రాస్తున్నందున ఈ పిటిషన్‌ను విచారించలేనని వెల్లడించారు.
Samayam Telugu TSPSC Group 1 Prelims


TSPSC Group 1 పరీక్ష వాయిదాతో పాటు.. గ్రూప్ 2, 3, 4 పరీక్షలకు మధ్య రెండు నెలల సమయం ఇవ్వాలని కోరుతూ 36 మంది అభ్యర్థులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. గ్రూప్ - 1 ప్రిలిమ్స్‌ పై స్టే విధిస్తూ.. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్‌ ద్వారా కోర్టును అభ్యర్థిస్తున్నారు. గతేడాది అక్టోబర్‌లో గ్రూప్‌ 1 పరీక్ష జరిగింది. ఫలితాలు కూడా వెలువడ్డాయి. అయితే.. పేపర్ లీక్‌ వ్యవహారంతో TSPSC గ్రూప్ - 1 ప్రిలిమ్స్ రద్దు చేసింది. తిరిగి జూన్ 11వ తేదీన పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

APPSC Group 1 Mains Hall Ticket 2023 : ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ హాల్‌టికెట్లు విడుదలయ్యాయి.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే
మరోవైపు కొనసాగుతున్న దర్యాప్తు
మరోవైపు పేపర్ల లీకేజీ వ్యవహారంపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. TSPSC అధికారులకు నోటీసులిచ్చినా తగిన సమాచారం ఇవ్వడంలేదని సిట్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్యాప్తునకు సహకరించకపోతే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించారు. అదేవిధంగా కాన్ఫిడెన్షియల్ ఇన్ ఛార్జి శంకర్ లక్ష్మీ అంశంలో సిట్ కీలక సమాచారాన్ని రాబట్టింది. ఈ లీకేజీలో శంకర్ లక్ష్మీ హస్తం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తుంది.

2017 నుంచి TSPSCలో శంకర్ లక్ష్మీ విధులు నిర్వర్తిస్తున్నారు. పేపర్ల వాల్యుయేషన్ చేయలేదని పలువురు అధికారులు సిట్ కు తప్పుడు వివరాలు ఇచ్చినట్లు గుర్తించారు. ఈ కేసులో ముఖ్య నిందితురాలు రేణుక రాథోడ్ కు సంబంధించి కీలక సమాచారాన్ని సిట్ సేకరించింది. బుధవారం మరోసారి విచారణకు రావాలని రేణుకకు సిట్ తాజాగా నోటీసులిచ్చింది. ఈ కేసులో అరెస్టుల సంఖ్య 36కు చేరింది. న్యూజిలాండ్‌లో ఉన్న ప్రశాంత్‌ ను ఇంకా అరెస్టు చేయాల్సి ఉందని సిట్ అధికారులు తెలిపారు.
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.