యాప్నగరం

TSPSC Group 1 Result 2022 : రేపే తెలంగాణ గ్రూప్‌ 1 ఫలితాలు..?

TSPSC Group 1 : ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలతో పాటు గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల షెడ్యూలు ప్రకటించేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్ష తేదీని దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్‌ చివరి వారంలో ఈ పరీక్షలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిపింది.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 5 Jan 2023, 10:56 am
TSPSC Group 1 Result 2022 : తెలంగాణ గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల వెల్లడికి TSPSC కసరత్తు పూర్తిచేసింది. వారం రోజుల్లోపే పరీక్ష ఫలితాలు వెల్లడించాలని భావిస్తోంది. ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలతో పాటు గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల షెడ్యూలు ప్రకటించేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్ష తేదీని దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్‌ చివరి వారంలో ఈ పరీక్షలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిపింది.
Samayam Telugu TSPSC Group 1 Result 2022


రాష్ట్రంలో 503 గ్రూప్‌-1 సర్వీసుల పోస్టులను భర్తీ చేసేందుకు TSPSC ఉద్యోగ ప్రకటన వెలువరించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. అక్టోబరు 16న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు 2,85,916 మంది హాజరయ్యారు. అక్టోబరు 29న ప్రాథమిక కీ ప్రకటించి, అభ్యంతరాలు ఆహ్వానించింది. అభ్యర్థుల నుంచి వ్యక్తమైన అభ్యంతరాలపై సబ్జెక్టు నిపుణుల కమిటీ సిఫార్సులు పరిశీలించి 5 ప్రశ్నలను తొలగిస్తూ కమిషన్‌ నవంబరు 15న తుది కీ ప్రకటించింది. మాస్టర్‌ ప్రశ్నపత్రం ప్రకారం 29, 48, 69, 82, 138 ప్రశ్నలను తొలగించింది.

Coronavirus : లాక్‌డౌన్‌తో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు..! వాస్తవమెంత..?
అయితే TSPSC గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి ఓఎంఆర్‌ ఆన్సర్‌ షీట్‌ మూల్యాంకనం ఇప్పటికే పూర్తయింది. మూల్యాంకనం తరువాత ప్రిలిమినరీ ఫలితాల ప్రకటనలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఒకటికి రెండుసార్లు అన్ని వివరాలను సరిచూస్తోంది. ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను 1:50 నిష్పత్తిలో ప్రకటించనుంది. అంటే ప్రధాన పరీక్షకు మొత్తం 25,150 మందిని ఎంపిక చేయనుంది. ఈ మేరకు మల్టీజోన్లు, రిజర్వుడు వర్గాల వారీగా జాబితాలను క్షుణ్నంగా పరిశీలిస్తోంది. ఫలితాలు ఈ వారంలోనే ఇవ్వాలని భావిస్తోంది. తాజాగా సమాచారం ప్రకారం జనవరి 6 లేదా 7 తేదీల్లో ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి. ఏవైనా సాంకేతిక ఇబ్బందులతో ఆలస్యమైతే సోమవారం (డిసెంబర్‌ 9) నాటికి ఫలితాలను వెల్లడించనుంది. అభ్యర్థులు ఫలితాలు వెలువడ్డాక https://www.tspsc.gov.in/ వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.