యాప్నగరం

IBM Off Campus Drive 2022: ఐబీఎం ఆఫ్‌ క్యాంపస్‌ డ్రైవ్‌.. ఏడాదికి రూ.4.90 లక్షల వరకూ జీతం.. ఎవరు అర్హులంటే..?

Software Jobs 2022: బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్/ ఎంసీఏ/ ఎమ్మెస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. 2020/ 2021లో ఉత్తీర్ణులైన గ్రాడ్యుయేట్స్‌ మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వివరాల్లోకెళ్తే..

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 19 May 2022, 12:31 am

ప్రధానాంశాలు:

  • ఐబీఎం ఆఫ్‌ క్యాంపస్‌ డ్రైవ్‌ 2022
  • అసొసియేట్‌ సిస్టమ్స్‌ ఇంజినీర్ల నియామకం

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu IBM Off Campus Drive 2022
IBM Off Campus Drive 2022: ప్రముఖ ఐటీ సంస్థ ఐబీఎం ఆఫ్‌ క్యాంపస్‌ డ్రైవ్‌ నిర్వహిస్తోంది. దీని ద్వారా అసొసియేట్‌ సిస్టమ్స్‌ ఇంజినీర్ (Associate Systems Engineer)లను నియమించుకోనుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాల్లోకెళ్తే..
ముఖ్య సమాచారం:
  • అర్హత: బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్/ ఎంసీఏ/ ఎమ్మెస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. 2020/ 2021లో ఉత్తీర్ణులైన గ్రాడ్యుయేట్స్‌ మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అలాగే.. ప్రొఫెషనల్‌ ప్రాజెక్ట్స్‌పై పని చేయడం వచ్చి ఉండాలి. విశ్లేషణాత్మక నైపుణ్యాలతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్‌ బాగా ఉండాలి.
  • జీతాలు: బీఈ/ బీటెక్‌/ ఎంసీఏ అభ్యర్థులకు ఏడాదికి రూ.4.50 లక్షలు.. ఎంఈ/ ఎంటెక్/ ఎమ్మెస్సీ అభ్యర్థులకు ఏడాదికి రూ.4.90 లక్షలు చెల్లిస్తారు.
  • ఎంపిక విధానం: కోడింగ్‌ క్యాపబిలిటీ, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తులకు చివరితేది: మే 30, 2022

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Wipro Elite NTH 2022: బీటెక్‌ విద్యార్థులకు బంపర్‌ ఆఫర్‌.. విప్రోలో భారీ సంఖ్యలో ఉద్యోగాలు.. ఏడాదికి రూ.3.5 లక్షల జీతం
Wipro Elite National Talent Hunt 2022: ప్ర‌ముఖ ఐటీ కంపెనీ విప్రో (Wipro) ఫ్రెష‌ర్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. ఎలైట్ నేషనల్ టాలెంట్ హంట్.. ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పేరుతో గ్రాడ్యుయేట్‌ల‌ను నియమించుకుంటోంది. ఈ ప్రొగ్రాం ద్వారా 2021, 2022 ఇంజ‌నీరింగ్ పాసైన విద్యార్థులంతా అర్హులేన‌ని పేర్కొంది. ఫైన‌ల్ ఇయ‌ర్ విద్యార్థులు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్య‌ర్థుల‌కు ఏడాదికి రూ.3.5 ల‌క్ష‌ల వేత‌నం ఉంటుంది. అంతే కాకుండా ఒక ఏడాది అగ్రిమెంట్ బాండ్ ఉంటుంది. ఎంపికైన వారు 2022-23 సంవత్సరంలో ఉద్యోగాల్లో చేరాల్సి ఉంటుంది. ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించి మే 2 వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ ప‌రీక్ష‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవడానికి మే 22, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. ఆన్‌లైన్‌ అసెస్‌మెంట్‌ మే 21 నుంచి జూన్‌ 5వ తేదీ వరకు ఉంటుంది.

పూర్తి వివరాలకు, అప్లయ్‌ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.