సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాలు కోరుకునే వారికి ఇది నిజంగానే గుడ్ న్యూస్. దిగ్గజ ఐటీ కంపెనీలైన ఇన్ఫోసిస్, టీసీఎస్ భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాయి. ఏడాదిలో 65,000 పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయి. కరోనా క్లిష్ట పరిస్థితుల్లోనూ భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు ప్రకటించాయి. ఇది కరోనా సంక్షోభ సమయంలో నిరుద్యోగులకు, ఫ్రెషర్స్కి ఊరట కలిగించే అంశం. ఇన్ఫోసిస్ వచ్చే ఏడాది కాలంలో 25,000 పైగా ఉద్యోగాలను ఫ్రెషర్స్తో భర్తీ చేయనుంది. ఇన్ఫోసిస్ భర్తీ చేయబోయే 25,000 ఉద్యోగాల్లో 24,000 పోస్టులు భారతీయులకు కేటాయించారు. వీటిని ఇండియాలోని ఇంజనీరింగ్ క్యాంపస్లలో ఎంపిక చేయనుంది. మిగతా 1,000 పోస్టులను మాత్రమే విదేశీయులకు కేటాయించారు. గతేడాది ఇన్ఫోసిస్ ఇండియాలో 21,000 మందిని నియమించుకున్న తెలిసిందే.
ఇక టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కూడా భారీగా ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్టు ప్రకటించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 40,000 మందికి పైగా ఉద్యోగులను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. టీసీఎస్ గతేడాది కూడా 40,185 ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంది.
కరోనా సంక్షోభ సమయంలో ఐటీ సంస్థలు వేలల్లో ఫ్రెషర్స్ని నియమించుకోబోతున్నాయి. ఈ రెండు ఐటీ కంపెనీలు కలిపి 65,000 పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయి.
ఇక టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కూడా భారీగా ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్టు ప్రకటించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 40,000 మందికి పైగా ఉద్యోగులను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. టీసీఎస్ గతేడాది కూడా 40,185 ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంది.
కరోనా సంక్షోభ సమయంలో ఐటీ సంస్థలు వేలల్లో ఫ్రెషర్స్ని నియమించుకోబోతున్నాయి. ఈ రెండు ఐటీ కంపెనీలు కలిపి 65,000 పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయి.