యాప్నగరం

ఫ్రెషర్లకు షాక్ ఇచ్చిన Wipro, Infosys, Tech Mahindra కంపెనీలు.. ఆఫర్ లెటర్లు వెనక్కి ఇచ్చేయండి అంటూ మెయిల్స్‌..! కారణం ఇదే

Infosys Wipro Tech Mahindra: ఈ కంపెనీలు ఫ్రెషర్లకు ముందుగా ఆఫర్ లెటర్లు(Offer Letters) ఇచ్చాయి. కానీ తరువాత నియామక ప్రక్రియ రద్దు చేశామని మెయిల్స్ పంపిస్తున్నాయి.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 4 Oct 2022, 11:28 am
Wipro Infosys Tech Mahindra: ఐటీ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్లకు ఆఫర్ లెటర్ చేతికి వచ్చిందంటే.. జాబ్‌ వచ్చేసినట్లే. అయితే టెక్ కంపెనీలు ఇలా ఆఫర్ లెటర్ ఇచ్చి కూడా.. ఫ్రెషర్లకు మొండి చేయి చూపిస్తున్నాయి. దిగ్గజ ఐటీ కంపెనీలైన విప్రో (Wipro), ఇన్ఫోసిస్ (Infosys), టెక్ మహీంద్రాలో (Tech Mahindra) ఇటువంటి కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ టెక్ కంపెనీలు అనుభవం లేని అభ్యర్థులను నియమించుకోవడానికి నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కంపెనీలు ఫ్రెషర్లకు ముందుగా ఆఫర్ లెటర్లు(Offer Letters) ఇచ్చాయి. కానీ తరువాత నియామక ప్రక్రియ రద్దు చేశామని మెయిల్స్ పంపిస్తున్నాయి. దీంతో ఆఫర్ లెటర్లు పొందిన ఫ్రెష్ టెక్కీలు ఆయోమయంలో పడ్డారు.
Samayam Telugu Wipro Infosys Tech Mahindra revoke offer letters


పెద్ద పెద్ద ఐటీ కంపెనీల్లో చేరుతున్నామన్న వాళ్ల ఆశలు అడియాశలుగా మిగిలిపోయాయి. అంతకుముందు వీరి జాయినింగ్ ప్రాసెస్‌ను కూడా మూడు- నాలుగు నెలలు ఆలస్యం చేసినట్లు తెలుస్తోంది. తీరా జాబ్‌లో చేరాలనుకుంటున్న సమయంలో వారిని వెనక్కి పంపించాయట. దీనికి సంబంధించి నేషనల్ మీడియాలో వస్తున్న కలకలం రేపుతున్నాయి.

Harsh Goenka Tweet: అందుకే ఆఫీస్‌కు రమ్మనేది..! కాఫీ, లంచ్‌ బ్రేక్ తీసుకోవచ్చు.. ట్రాఫిక్‌లో కొద్దిసేపు వెయిట్‌ చేయొచ్చు..

మీడియాలో వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం.. వందల మంది ఫ్రెషర్స్‌కు ఈ కంపెనీలు తొలుత ఆఫర్ లెటర్స్ ఇచ్చాయి. తర్వాత ఏమైందో ఏమో వారి జాయినింగ్ ప్రాసెస్‌ను కొంతకాలం పాటు వాయిదా వేశాయి. చివరకు ఆ ఆఫర్ లెటర్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ మేరకు సంబంధిత కంపెనీలు ఫ్రెషర్స్‌కు ఈ మెయిల్స్ కూడా పంపినట్లు బిజినెస్‌లైన్ నివేదించింది. ఆఫర్ లెటర్స్‌ను రిజెక్ట్ చేస్తున్నట్లు అందులో పేర్కొన్నాయని వెల్లడించింది. నియామక ప్రక్రియలో భాగంగా.. విద్యార్థులు చాలా రౌండ్ల ఇంటర్వ్యూల తర్వాత ఉద్యోగాలకు ఎంపికయ్యారని తెలిపింది.

''మీ విద్యార్హత ప్రమాణాలను మా కంపెనీకి సరితూగేలా లేవు. అందువల్ల మీకు ఇచ్చిన ఆఫర్ చెల్లదు.'' ఇలా ఫ్రెషర్స్‌కు పలు కంపెనీలు మెయిల్ చేసినట్లు బిజినెస్‌లైన్ వివరించింది. అయితే దీనిపై సంబంధిత టెక్ దిగ్గజ కంపెనీలు ఇప్పటివరకైతే స్పందించలేదు.

Software Jobs: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు.. TATA, Wipro, Accenture, TCS సంస్థల్లో ఐటీ జాబ్స్‌.. ఇలా అప్లయ్‌ చేసుకోండి

ఇటీవల ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆర్థిక మాంద్యం భయాలు ఈ నియామకాలను వెనక్కితీసుకోవడానికి కారణాలుగా భావిస్తున్నారు. మాంద్యం భయాలు, అధిక ద్రవ్యోల్బణం సహా పలు కారణాలతో దేశంలో పలు పారిశ్రామిక సంస్థలపై పెద్ద దెబ్బ పడింది. ఐటీ/టెక్ ఇండస్ట్రీ దీనికి మినహాయింపేం కాదు. అందుకే మున్ముందు పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని.. తమపై భారాన్ని తగ్గించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఈ పరిస్థితి మరింత తీవ్రం అవుతుందని ఐటీ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఈ భారాన్ని తగ్గించుకునేందుకు ఇటీవల ప్రముఖ టెక్ కంపెనీ టీసీఎస్ తమ ఉద్యోగులకు వేరియబుల్ పే (పనితీరు ఆధారంగా వేతనం) పోస్ట్‌పోన్ చేసింది. ఇన్ఫోసిస్ 70 శాతానికి తగ్గించగా.. విప్రో పూర్తిగా వాయిదా వేసింది. మరోవైపు విప్రో.. ఇటీవల మూన్‌లైటింగ్ పేరిట దాదాపు 300 మంది ఉద్యోగులను కూడా తొలగించింది. దీనికి పలువురు మద్దతు తెలపగా.. మరికొందరు వ్యతిరేకించారు. అయితే.. https://www.naukri.com/ రిపోర్ట్ ప్రకారం.. ఐటీ సెక్టార్‌లో నియాకమాలు తగ్గాయి. ఆగస్టులో 10 శాతం మేర హైరింగ్ యాక్టివిటీ తగ్గినట్లు తెలిసింది. ఆర్థిక మందగమనం వంటి పరిస్థితుల కారణంగా, చాలా కంపెనీలు నియామకాలను స్తంభింపజేశాయి. గూగుల్ , ఫేస్‌బుక్ మరియు మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలు కూడా కొత్త నియామకాలను నిలిపివేశాయి.

TCS NQT 2023: నిరుద్యోగులకు TCS బంపరాఫర్‌.. 1.6 లక్షల ఉద్యోగాలు.. 1200కి పైగా కంపెనీలు.. ఈ అర్హతలుంటే అప్లయ్‌ చేసుకోండి
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.