యాప్నగరం

RRB Group D Admit Card 2022: రైల్వే పరీక్షలు.. ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌ డీ అడ్మికార్డులు ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు

Railway Recruitment Board: రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు గ్రూప్ D ఫేజ్ 1 పరీక్ష ఆగస్టు 17 నుంచి ఆగస్టు 25 వరకు జరుగుతాయి. ఇక ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను..

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 13 Aug 2022, 8:31 pm
RRB Group D Phase 1 Admit Card 2022: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) గ్రూప్ డీ రిక్రూట్‌మెంట్ రాత పరీక్షల తేదీలను రైల్వే అధికారులు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. RRB గ్రూప్ D ఫేజ్ 1 పరీక్ష ఆగస్టు 17 నుంచి ఆగస్టు 25 వరకు జరుగుతాయి.
Samayam Telugu RRB Group D Admit Card 2022


RRB Group D Admit Card ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి:
ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థుల కోసం ట్రావెల్ అథారిటీని డౌన్‌లోడ్ చేసుకునే లింక్ ఆగస్టు 9న RRB అధికారిక వెబ్‌సైట్‌లో రాత్రి 10 గంటలకు యాక్టివేట్ చేయబడుతుంది. దీనితో పాటు.. అభ్యర్థులు పరీక్ష నగరం మరియు తేదీని కూడా చూసుకోవచ్చు. ఇక పరీక్ష జరిగే రోజుకు నాలుగు రోజుల ముందు అడ్మిట్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో తెలిపారు. అంటే పరీక్ష ఆగస్టు 17న ఉంటే.. అభ్యర్థులు ఆగస్టు 13 లేదా 14 నుండి అడ్మిట్ కార్డ్‌లను https://www.rrbcdg.gov.in/ వెబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పరీక్ష సమయంలో ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ ఉంటుంది.

RRB Group D ఎంపిక ప్రక్రియ ద్వారా రైల్వేలో లెవల్ 1 కింద 1,03,769 ఖాళీలను భర్తీ చేస్తారు. ఇందులో జనరల్ కేటగిరీకి 42,355, షెడ్యూల్డ్ కులాల కేటగిరీకి 15,559, షెడ్యూల్డ్ తెగలకు 7,984, ఇతర వెనుకబడిన తరగతులకు 27,378, ఆర్థికంగా బలహీన వర్గాలకు 10,381 పోస్టులు ఉన్నాయి.

పరీక్ష విధానం:
RRB Group D పరీక్ష పేపర్ 100 మార్కులకు ఉంటుంది. నెగెటివివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి మూడో వంతు మార్కు కోత విధిస్తారు. పరీక్ష 90 నిమిషాలు ఉంటుంది. ఇందులో జనరల్ సైన్స్ నుంచి 25, మ్యాథ్స్ నుంచి 25, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30, జనరల్ అవేర్‌నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 ప్రశ్నలు అడుగుతారు.

జనరల్ కేటగిరీ అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించాలంటే 40 శాతం, ఈడబ్ల్యూఎస్‌కు 40 శాతం, ఓబీసీకి 30, ఎస్సీ, ఎస్టీలకు 30 శాతం ఉండాలి. వీటిలో మెరిట్ సాధించిన వారిని పీఈటీకి పిలుస్తారు. దానిని కూడా విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్టుకు పిలుస్తారు. అనంతరం తుది ఎంపిక చేస్తారు.
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.