యాప్నగరం

RRB Group D Results 2022 : ఆర్‌ఆర్‌బీ Secunderabad ఫిజికల్ టెస్టుల తేదీలు ఖరారు.. కటాఫ్‌ మార్కులు, టైమ్‌, స్థలం వివరాలివే

Railway Recruitment Board Exam : రాత పరీక్ష ఫలితాలు (RRB Group D Result) తాజాగా విడుదలైన విషయం తెలిసిందే. సికింద్రాబాద్‌ జోన్‌లో 24,596 మంది పీఈటీ పరీక్షలకు ఎంపికయ్యారు.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 24 Dec 2022, 10:05 pm
RRB Group D Results 2022 : ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌-డీ రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు అలర్ట్‌. జనవరిలో శారీరక సామర్థ్య పరీక్ష (PET)లు నిర్వహించనున్నట్లు ఆర్‌ఆర్‌బీ సికింద్రాబాద్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. రాత పరీక్ష ఫలితాలు (RRB Group D Result) తాజాగా విడుదలైన విషయం తెలిసిందే. సికింద్రాబాద్‌ జోన్‌లో 24,596 మంది పీఈటీ పరీక్షలకు ఎంపికయ్యారు. పీఈటీ నుంచి దివ్యాంగులకు మినహాయింపు నేపథ్యంలో వారి ఫలితాలను వెల్లడించలేదు.
Samayam Telugu RRB Group D Results 2022


Secunderabad లోని రైల్వే స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ గ్రౌండ్, రైల్వే ప్రొటెక్షన్‌ స్పెషల్‌ ఫోర్స్‌ గ్రౌండ్‌లో ఎంపికైన అభ్యర్థులకు జనవరి 12 నుంచి 21 వరకు ఫిజికల్‌ ఎఫీషియన్సీ టెస్ట్‌లు నిర్వహించనున్నారు. PET కి ఎంపికైన అభ్యర్థుల పేర్లు, రిజిస్ట్రేషన్‌ నంబర్‌, రోల్‌ నంబర్‌, కమ్యూనిటీ, పీఈటీ తేదీ, సమయం, నిర్వహణ స్థలం వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఎంపిక ప్రక్రియపై తాజా సమాచారం కోసం అభ్యర్థులు ఆర్‌ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌ చూడాలని రైల్వే శాఖ సూచించింది.

RRB Group D Result - సికింద్రాబాద్‌ జోన్‌ జాబితా

RRC-Level-1-

కటాఫ్‌ మార్కులు

RRB_Cut_Off_Level_1_SCR_V1
PET షెడ్యూల్‌

PET SCHEDULE 09 2019

1,03,769 గ్రూప్ డీ పోస్టులకు పరీక్ష :
RRB Group D నియామకాలకు సంబంధించి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ)ను దేశవ్యాప్తంగా 5 విడతల్లో సీబీటీ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. నాలుగేళ్ల క్రితం 16 ఆర్‌ఆర్‌బీల పరిధుల్లో 1,03,769 గ్రూప్-డి పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల కాగా సుమారు కోటి మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. RRB Group D పోస్టుల భర్తీకి సంబంధించి ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 11 వరకు ఆన్‌లైన్ విధానంలో రాత పరీక్షను వివిధ దశల్లో రైల్వే శాఖ నిర్వహించింది.

Railway : సౌత్‌ రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. ఇంటర్‌, డిగ్రీ పాసైన వాళ్లు అర్హులు
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.