యాప్నగరం

Railway Jobs: రాత పరీక్ష లేకుండా.. రైల్వేలో 2077 ఉద్యోగాలు.. 10వ త‌ర‌గ‌తి పాస్ అయితే చాలు

SECR Apprentice Recruitment 2022: సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (SECR).. వివిధ ట్రేడ్‌లలో ఖాళీగా ఉన్న 2077 అప్రెంటీస్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ పోస్టులకు ఎలాంటి రాత ప‌రీక్ష లేకుండా ప‌దోత‌ర‌గ‌తి విద్యార్హ‌త‌తోనే అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయనున్నారు.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 23 May 2022, 10:54 am

ప్రధానాంశాలు:

  • సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే రిక్రూట్‌మెంట్‌
  • 2077 అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌
  • కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu SECR Railway Jobs Recruitment 2022
Railway Jobs: ఇండియన్‌ రైల్వే (Indian Railways) మరో జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (SECR).. వివిధ ట్రేడ్‌లలో ఖాళీగా ఉన్న 2077 అప్రెంటీస్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ పోస్టులకు ఎలాంటి రాత ప‌రీక్ష లేకుండా ప‌దోత‌ర‌గ‌తి విద్యార్హ‌త‌తోనే అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయనున్నారు.
ఇక ఈ పోస్టులకు సంబంధించిన ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌.. నోటిఫికేష‌న్ వివ‌రాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://secr.indianrailways.gov.in/ ను చూడొచ్చు. నాగ్‌పూర్ డివిజన్ కోసం దరఖాస్తును సమర్పించడానికి జూన్ 3 చివరి తేదీ కాగా.. రాయ్‌పూర్ డివిజన్ కోసం దరఖాస్తు సమర్పించడానికి మే 24 చివరితేది.

TSLPRB: తెలంగాణ అగ్నిమాపక శాఖలో 225 ఉద్యోగాలు.. ఇంటర్‌ పాసై ఉంటే చాలు.. జోన్ల వారీగా ఖాళీల వివరాలివే
మొత్తం ఖాళీలు: 2077
  • నాగ్‌పూర్ డివిజన్ పోస్టుల సంఖ్య : 1044
  • రాయ్‌పూర్ డివిజన్ ఖాళీల సంఖ్య: 1033

ముఖ్యసమాచారం:
దరఖాస్తు చేసుకోవాలనుకున్న అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి లేదా గుర్తింపు పొందిన బోర్డు నుంచి తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. అంతే కాకుండా 15 నుంచి 24 ఏళ్ల మధ్య వయసు ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. పూర్తి వివరాలను నోటిఫికేషన్‌లో చూడొచ్చు.

అప్లయ్‌ చేసుకోవడానికి లింక్‌ ఇదే.. క్లిక్‌ చేయండి

Indian Railways: రాత పరీక్ష లేకుండానే.. రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌లో ఉద్యోగాలు.. వెంటనే అప్లయ్‌ చేసుకోండి
CRIS Recruitment 2022: భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన న్యూడిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS) లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 150 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో అసిస్టెంట్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు 144, అసిస్టెంట్ డేటా అనలిస్టులు 6 ఖాళీలు ఉన్నాయి.

కంప్యూటర్ సైన్స్, అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్టాటిస్టిక్స్, విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి గేట్ 2022 మెరిట్ స్కోర్ అధారంగా ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 25, 2022 నుండి ప్రారంభమవుతుంది. మే 24, 2022 దరఖాస్తులకు చివరి తేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ https://cris.org.in/ చూడొచ్చు.
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.