KTR Meet Kumarasawamy: జనతాదళ్ సెక్యులర్ పార్టీ (Janata Dal Party) నేత, కర్ణాటక మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి (Karnataka Ex CM Kumaraswamy) తెలంగాణ మంత్రి కేటీఆర్ (KTR) పై ప్రశంసలు కురిపించారు. నేడు సీఎం కేసీఆర్ (CM KCR) తో సమావేశం నేపథ్యంలో హైదరాబాద్కు వచ్చిన కుమారస్వామిని ఉదయం ఆయన బస చేసిన హోటల్కు వెళ్లి మంత్రి కేటీఆర్ మర్యాదపూర్వకంగా కలిశారు. కుమారస్వామితో కలిసి కేటీఆర్ టిఫిన్ చేశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్తో పలు అంశాలపై అర్థవంతమైన చర్చ జరిగినట్టు కుమారస్వామి తెలిపారు. తన అధికారిక ట్విట్టర్ వేదికగా ఈ అంశాన్ని పంచుకున్నారు. అభివృద్ధిపై గొప్ప విజన్ ఉన్న నేత కేటీఆర్ అని కుమారస్వామి ప్రశంసించారు. తెలంగాణ, కర్ణాటకతో పాటు కీలకమైన జాతీయ రాజకీయాలపై కూడా చర్చించినట్లు కుమారస్వామి ట్వీట్ చేశారు.
జాతీయ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించేందుకు పిడికిలి బిగించిన తెలంగాణ సీఎం కేసీఆర్.. దేశంలోని వివిధ పార్టీల నేతలతో సమావేశమవుతున్నారు. ఈ క్రమంలోనే కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామిని ఈరోజు మధ్యాహ్న భోజనానికి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు హైదరాబాద్కు వచ్చిన కుమారస్వామి.. కేటీఆర్పై ప్రశంసలు కురిపించారు. అనంతరం.. ప్రగతిభవన్కు చేరుకుని సీఎం కేసీఆర్తో కలిసి మధ్యాహ్న బోజనం చేశారు.
అనంతరం భేటీ అయిన ఇద్దరు నేతలు.. జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల పాత్ర, కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు, భవిష్యత్ కార్యాచరణపై ఇద్దరు నేతలు చర్చిస్తున్నట్టు సమాచారం. జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన కేసీఆర్ గతంలోనే బెంగళూరు వెళ్లి.. మాజీ ప్రధాని దేవెగౌడ, కుమారస్వామితో సమావేశమయ్యారు. జాతీయ రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న కేసీఆర్.. కుమారస్వామితో భేటీ కావటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
జాతీయ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించేందుకు పిడికిలి బిగించిన తెలంగాణ సీఎం కేసీఆర్.. దేశంలోని వివిధ పార్టీల నేతలతో సమావేశమవుతున్నారు. ఈ క్రమంలోనే కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామిని ఈరోజు మధ్యాహ్న భోజనానికి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు హైదరాబాద్కు వచ్చిన కుమారస్వామి.. కేటీఆర్పై ప్రశంసలు కురిపించారు. అనంతరం.. ప్రగతిభవన్కు చేరుకుని సీఎం కేసీఆర్తో కలిసి మధ్యాహ్న బోజనం చేశారు.
అనంతరం భేటీ అయిన ఇద్దరు నేతలు.. జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల పాత్ర, కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు, భవిష్యత్ కార్యాచరణపై ఇద్దరు నేతలు చర్చిస్తున్నట్టు సమాచారం. జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన కేసీఆర్ గతంలోనే బెంగళూరు వెళ్లి.. మాజీ ప్రధాని దేవెగౌడ, కుమారస్వామితో సమావేశమయ్యారు. జాతీయ రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న కేసీఆర్.. కుమారస్వామితో భేటీ కావటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.