యాప్నగరం

కర్ణాటక ఎన్నికలు... ప్రారంభమైన ఓట్ల లెక్కింపు

దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తోన్న కర్ణాటక శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. కట్టుదిట్టమైన భద్రత నడుమ 40 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.

Samayam Telugu 15 May 2018, 8:21 am
దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తోన్న కర్ణాటక శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. కట్టుదిట్టమైన భద్రత నడుమ 40 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. సుమారు 56 వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. కర్ణాటక శాసనసభలో 224 నియోజకవర్గాలుండగా, 222 స్థానాలకు మాత్రమే మే 12 న పోలింగ్ నిర్వహించారు. ఓట్ల లెక్కింపులో దాదాపు 11 వేల మంది సిబ్బంది పాల్గొంటున్నారు. ఇక బెంగళూరు నగరంలో 5 కేంద్రాల్లో లెక్కింపు జరుగుతోంది. ప్రధాన పక్షాలు కాంగ్రెస్‌, భాజపా, జనతాదళ్‌లో ఏ పార్టీకి కన్నడ ప్రజలు పట్టం కట్టారనేది మధ్యాహ్నానికల్లా తెలిసిపోనుంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కాంగ్రెస్ ఆధిక్యం చూపుతోంది.
Samayam Telugu కర్ణాటక ఎన్నికలు


ఇక ఎగ్జిట్‌ పోల్స్ సర్వేలు మాత్రం కన్నడనాట హంగ్‌ ఏర్పడే అవకాశం ఉన్నట్లు ప్రకటించడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ఎన్నికల్లో జేడీఎస్ కింగ్‌ మేకర్‌గా నిలిచే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతోంది. హంగ్‌ ఏర్పడితే జనతాదళ్ ఏ పార్టీవైపు మొగ్గు చూపితే వారికే అధికారం దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలో జరిగిన ఎన్నికల పోరులో కాంగ్రెస్‌ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుని 33 ఏళ్ల సంప్రదాయానికి తెరదించుతుందా? కమలనాథులు 35 ఏళ్ల కల నెరవేరుతుందా? దక్షిణాదిలో కాషాయదళం ప్రాబల్యాన్ని విస్తరిస్తారా? ప్రాంతీయ పక్షాలే రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షిస్తాయంటూ ప్రచారం చేసిన జనతాదళ్‌కు జనం పట్టం కడతారా? అనే ప్రశ్నలకు మరికొద్ది గంటల్లో సమాధానం లభిస్తుంది. 1952 తర్వాత ఎన్నడూ లేనంతగా 72.36 శాతం ఓటింగ్ కర్ణాటకలో నమోదైనందున త్రిశంకు సభ ఏర్పడే అవకాశాలు అరుదని రాజకీయ పరిశీలకుల అంచనా వేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.