యాప్నగరం

ధోనీ మా జట్టుతో ఆడితే చాలు..!

ఐపీఎల్ వేలంలో ధోనీని కొనుగోలు చేసేందుకు అవసరమైతే నా పైజామాను సైతం అమ్మేందుకు నేను సిద్ధమే

TNN 25 Apr 2017, 6:04 pm
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీని ఐపీఎల్ వేలంలో దక్కించుకునే అవకాశం వస్తే.. సర్వస్వం అమ్మి కొనుగోలు చేస్తానని కోల్‌కతా నైట్‌రైడర్స్ ఓనర్ షారూఖ్ ఖాన్ వెల్లడించాడు. ఐపీఎల్ ఆరంభమై ఈ ఏడాదితో పదేళ్లు గడుస్తున్న నేపథ్యంలో 2018 సీజన్ వేలానికి క్రికెటర్లందరూ వేలంలోకి రానున్నారు. దీంతో అప్పుడే ఫ్రాంఛైజీ ఓనర్లు ఎవరెవర్నీ కొనుగోలు చేయాలనే ప్రణాళికలు రచించేస్తున్నారు. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ యజమాని శ్రీనివాసన్ వచ్చే ఏడాది చెన్నై జెర్సీతో కెప్టెన్‌గా ధోని బరిలోకి దిగుతాడంటూ ప్రకటించేశాడు. తాజాగా షారూక్ ‘ఐపీఎల్ వేలంలో ధోనీని కొనుగోలు చేసేందుకు అవసరమైతే నా పైజామాను సైతం అమ్మేందుకు నేను సిద్ధమే’ అంటూ అందర్నీ ఆశ్చర్యపరిచాడు. గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలోని కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇప్పటికే రెండుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.
Samayam Telugu kkr owner shah rukh khan willing to sell even his pyjama to buy ms dhoni
ధోనీ మా జట్టుతో ఆడితే చాలు..!


ఉత్కంఠ మ్యాచ్‌లను సైతం చివర్లో చాకచక్యంగా ముగించడంలో ధోనీది అందివేసిన చేయి. గత కొంతకాలంగా బ్యాటింగ్‌లో విఫలమైన ఈ హిట్టర్.. ఇటీవల హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అనూహ్యంగా చెలరేగి మళ్లీ ఫామ్ అందుకున్నాడు. కెప్టెన్, హిట్టర్, వికెట్ కీపర్‌గా మూడు పాత్రలు పోషిస్తూ కొన్నేళ్ల పాటు భారత్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లను ధోనీ విజయవంతంగా నడిపించాడు. ధోనీకి ఉన్న ఫ్యాన్స్ క్రేజ్ కూడా ఐపీఎల్‌లో అతను ఆడే జట్టుకు లాభం చేకూరుస్తుందని ఫ్రాంఛైజీలు భావిస్తున్నాయి. ధోనీకి ఏ జట్టు జెర్సీతో బరిలోకి దిగుతాడో తెలియాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే. ఈ ఏడాది రైజింగ్ పుణె సూపర్ జెయింట్ ధోనీని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.