యాప్నగరం

ఢిల్లీపై ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్

గాయం కారణంగా ఈ మ్యాచ్‌కి ఢిల్లీ కెప్టెన్ జహీర్ ఖాన్ దూరమవడంతో అతని స్థానంలో కరుణ్ నాయర్

TNN 30 Apr 2017, 3:45 pm
ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ మాక్స్‌వెల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టోర్నీలో ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లాడిన పంజాబ్ జట్టు మూడింట్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో ఆరోస్థానంలో కొనసాగుతుండగా.. వరుస ఓటములతో ఢీలాపడిన ఢిల్లీ జట్టు 7 మ్యాచ్‌ల్లో రెండింట్లో మాత్రమే గెలుపొంది చివరి స్థానానికి పరిమితమైంది. గాయం కారణంగా ఈ మ్యాచ్‌కి ఢిల్లీ కెప్టెన్ జహీర్ ఖాన్ దూరమవడంతో అతని స్థానంలో కరుణ్ నాయర్ జట్టును నడిపించనున్నాడు. మరోవైపు హైదరాబాద్‌తో మ్యాచ్‌కి దూరమైన హసీస్ ఆమ్లా తిరిగి పంజాబ్ జట్టుతో చేరాడు.
Samayam Telugu kxip vs dd kings xi punjab opt to bowl
ఢిల్లీపై ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్


పంజాబ్ జట్టు
మార్టిన్ గప్తిల్, హసీమ్ ఆమ్లా, మనన్ వోహ్రా, షాన్ మార్ష్, మాక్స్‌వెల్, సాహా, అక్షర్ పటేల్, మోహిత్ శర్మ, వరుణ్ అరోన్, సందీప్ శర్మ, నటరాజన్

ఢిల్లీ జట్టు
శ్యామ్ బల్లింగ్స్, సంజు శాంసన్, కరుణ్ నాయర్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, కోరె అండర్సన్, క్రిస్ మోరీస్, రబాడ, అమిత్ మిశ్రా, నదీమ్, మహ్మద్ షమీ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.