ఢిల్లీ పోరాటమే లేదు.. కింగ్స్కి దాసోహమే..!
ఐపీఎల్ పదో సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ చరిత్రలో నిలిచిపోయే విజయం సాధించింది. మొహాలి వేదికగా
TNN 30 Apr 2017, 6:23 pm
ఐపీఎల్ పదో సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ చరిత్రలో నిలిచిపోయే విజయం సాధించింది. మొహాలి వేదికగా ఆదివారం సాయంత్రం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ డేర్డెవిల్స్పై 10 వికెట్ల తేడాతో పంజాబ్ అలవోక విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు పంజాబ్ బౌలర్ల ధాటికి 17.1 ఓవర్లలోనే 67 పరుగులకు కుప్పకూలిపోయింది అనంతరం లక్ష్య ఛేదనలో ఓపెనర్ మార్టిన్ గప్తిల్ (50 నాటౌట్: 27 బంతుల్లో 6x4, 3x6) మెరుపులు మెరిపించడంతో పంజాబ్ కేవలం 7.5 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించి ఔరా అనిపించింది. టోర్నీలో 9వ మ్యాచ్ ఆడిన పంజాబ్కి ఇది నాలుగో గెలుపు.
అంతకముందు టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ మాక్స్వెల్ మరో ఆలోచన లేకుండా ఢిల్లీని బ్యాటింగ్కి ఆహ్వానించాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే సందీప్ శర్మ ఓపెనర్ శ్యామ్ బిల్లింగ్స్ (0)ని డకౌట్గా పెవిలియన్కి పంపి ఢిల్లీకి షాకిచ్చాడు. అనంతరం కొద్దిసేపటికే సంజు శాంసన్ (5), కరుణ్ నాయర్ (11), శ్రేయాస్ అయ్యర్ (6), రిషబ్ పంత్ (3), క్రిస్ మోరీస్ (2) వరుసగా పెవిలియన్కి క్యూ కట్టేయడంతో ఆ జట్టు కోలుకోలేకపోయింది. ఒక ఎండ్లో అండర్సన్ (18) వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేయాలని తీవ్రంగా ప్రయత్నించినా.. లాభం లేకపోయింది. పంజాబ్ బౌలర్లు సమష్టిగా రాణిస్తూ క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో చివరికి ఆ జట్టు 67 పరుగులకే ఆలౌటైంది. సందీప్ శర్మ 4 వికెట్లతో ఢిల్లీ పతనాన్ని శాసించగా.. అక్షర్ పటేల్, వరుణ్ అరోన్ చెరో రెండు వికెట్లతో సత్తాచాటారు. మోహిత్ శర్మ, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు. కోల్కతాపై 49 పరుగులకు ఆలౌటై తాజా సీజన్లో బెంగళూరు తక్కువ స్కోరుతో ఓ చెత్త రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే.
అంతకముందు టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ మాక్స్వెల్ మరో ఆలోచన లేకుండా ఢిల్లీని బ్యాటింగ్కి ఆహ్వానించాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే సందీప్ శర్మ ఓపెనర్ శ్యామ్ బిల్లింగ్స్ (0)ని డకౌట్గా పెవిలియన్కి పంపి ఢిల్లీకి షాకిచ్చాడు. అనంతరం కొద్దిసేపటికే సంజు శాంసన్ (5), కరుణ్ నాయర్ (11), శ్రేయాస్ అయ్యర్ (6), రిషబ్ పంత్ (3), క్రిస్ మోరీస్ (2) వరుసగా పెవిలియన్కి క్యూ కట్టేయడంతో ఆ జట్టు కోలుకోలేకపోయింది. ఒక ఎండ్లో అండర్సన్ (18) వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేయాలని తీవ్రంగా ప్రయత్నించినా.. లాభం లేకపోయింది. పంజాబ్ బౌలర్లు సమష్టిగా రాణిస్తూ క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో చివరికి ఆ జట్టు 67 పరుగులకే ఆలౌటైంది. సందీప్ శర్మ 4 వికెట్లతో ఢిల్లీ పతనాన్ని శాసించగా.. అక్షర్ పటేల్, వరుణ్ అరోన్ చెరో రెండు వికెట్లతో సత్తాచాటారు. మోహిత్ శర్మ, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు. కోల్కతాపై 49 పరుగులకు ఆలౌటై తాజా సీజన్లో బెంగళూరు తక్కువ స్కోరుతో ఓ చెత్త రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే.