యాప్నగరం

పంజాబ్‌ని దెబ్బతీసిన గుజరాత్

గుజరాత్ ఒత్తిడిలో పడినట్లు కనిపించింది. కానీ.. చివర్లో దినేశ్ కార్తీక్ పంజాబ్ బౌలర్లకి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మరో రెండు బంతులు

TNN 7 May 2017, 11:46 pm
ఐపీఎల్ పదో సీజన్‌లో ఎట్టకేలకు గుజరాత్ లయన్స్ మళ్లీ విజయాన్ని అందుకుంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో మొహాలి వేదికగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో డ్వేన్ స్మిత్ (74: 39 బంతుల్లో 8x4, 4x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో గుజరాత్ లయన్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. అంతకముందు ఆమ్లా (104: 60 బంతుల్లో 8x4, 5x6) మెరుపు శతకం బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ఛేదనలో డ్వేన్ స్మిత్‌తో పాటు కెప్టెన్ సురేశ్ రైనా (39: 25 బంతుల్లో 4x4, 1x6) నిలకడగా ఆడినా కీలక సమయంలో వీరిద్దరూ ఔటవడంతో గుజరాత్ ఒత్తిడిలో పడినట్లు కనిపించింది.
Samayam Telugu kxip vs gl gujarat lions won by 6 wkts
పంజాబ్‌ని దెబ్బతీసిన గుజరాత్


కానీ.. చివర్లో దినేశ్ కార్తీక్ (35 నాటౌట్: 23 బంతుల్లో 2x4, 1x6) పంజాబ్ బౌలర్లకి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మరో రెండు బంతులు మిగిలి ఉండగానే బౌండరీతో లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఇప్పటికే టోర్నీలో ప్లేఆఫ్ అవకాశాలు చేజార్చుకున్న గుజరాత్.. తాజా గెలుపుతో పంజాబ్ అవకాశాల్ని కూడా సంక్లిష్టం చేసింది. డ్వేన్‌స్మిత్‌కి రెండు సార్లు.. సురేశ్ రైనాకి పంజాబ్ ఫీల్డర్లు క్యాచ్ వదిలేసి జీవనదానమిచ్చారు. దీంతో టోర్నీలో వరుసగా రెండోసారి ఆమ్లా శతకం వృథాగా మిగిలిపోయింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.