రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల వాలంటీర్ల పనితీరుపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు వాలంటీర్లకు కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచించారు. వారి పనితీరు మెరుగు పరిచేందుకు చేయూతినివ్వాలని చెప్పారు. అయినా వాలంటీర్లలో మార్పు రాకపోతే వారిని తొలగించి.. కొత్త వారిని నియమించాలని పేర్కొన్నారు.
గురువారం స్పందనపై సీఎం జగన్ మోహన్ రెడ్డి వివిధ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడారు. సచివాలయాల్లో తనిఖీలు బాగున్నాయని.. తనిఖీలకు వెళ్లినప్పుడు రిజిస్టర్ను కచ్చితంగా పరిశీలించాలని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాలు మంచి పనితీరును కనబర్చాలన్నారు.
'దాదాపు 80 శాతం సచివాలయాల ఉద్యోగులు మంచి పనితీరు కనపరుస్తున్నారని తనిఖీల ద్వారా వెల్లడైందని చెబుతున్నారు. కలెక్టర్లు వారానికి కనీసం రెండు గ్రామ, వార్డు సచివాలయాలు తనిఖీ చేయాలి. జేసీలు కనీసం 4 గ్రామ, వార్డు సచివాలయాలు తనిఖీ చేయాలి. తనిఖీలకు వెళ్లినప్పుడు రిజిస్టర్ పరిశీలన తప్పనిసరి. తనిఖీలకు వెళ్లినప్పుడు గతంలో వ్యక్తం చేసిన సమస్యలను పరిష్కరించామా..? వాటిని సరిచేశామా..? లేదా..? చూడాలి. తనిఖీలకు సంబంధించి ప్రోటోకాల్ను తయారు చేయాలి. మిగిలిన 20 శాతం మంది సచివాలయాల సిబ్బందికి కూడా వారు పనితీరును మెరుగుపరిచేలా మనం వారికి తోడ్పాటును అందించాలి..' అని సీఎం జగన్ సూచించారు. అన్ని జిల్లాల కలెక్టర్లే ఈ బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు.
గురువారం స్పందనపై సీఎం జగన్ మోహన్ రెడ్డి వివిధ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడారు. సచివాలయాల్లో తనిఖీలు బాగున్నాయని.. తనిఖీలకు వెళ్లినప్పుడు రిజిస్టర్ను కచ్చితంగా పరిశీలించాలని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాలు మంచి పనితీరును కనబర్చాలన్నారు.
'దాదాపు 80 శాతం సచివాలయాల ఉద్యోగులు మంచి పనితీరు కనపరుస్తున్నారని తనిఖీల ద్వారా వెల్లడైందని చెబుతున్నారు. కలెక్టర్లు వారానికి కనీసం రెండు గ్రామ, వార్డు సచివాలయాలు తనిఖీ చేయాలి. జేసీలు కనీసం 4 గ్రామ, వార్డు సచివాలయాలు తనిఖీ చేయాలి. తనిఖీలకు వెళ్లినప్పుడు రిజిస్టర్ పరిశీలన తప్పనిసరి. తనిఖీలకు వెళ్లినప్పుడు గతంలో వ్యక్తం చేసిన సమస్యలను పరిష్కరించామా..? వాటిని సరిచేశామా..? లేదా..? చూడాలి. తనిఖీలకు సంబంధించి ప్రోటోకాల్ను తయారు చేయాలి. మిగిలిన 20 శాతం మంది సచివాలయాల సిబ్బందికి కూడా వారు పనితీరును మెరుగుపరిచేలా మనం వారికి తోడ్పాటును అందించాలి..' అని సీఎం జగన్ సూచించారు. అన్ని జిల్లాల కలెక్టర్లే ఈ బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు.