తాను ప్రెస్మీట్లో ఉండగా ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తనకు ఫోన్ చేసి బెదిరించిన మాట అవాస్తవమని ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు బండి శ్రీనివాస్ ప్రకటించారు. ఉద్యోగ సంఘాల జేఏసీలు కలిసిపోయాయని చెప్పడానికి రెండ్రోజుల కిందట తాము ప్రెస్మీట్ పెట్టామని చెప్పారు. ఆ ప్రెస్మీట్ జరుగుతున్న సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ చేసిన మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు.
సజ్జల తనకు శుభాకాంక్షలు చెప్పేందుకే ఫోన్ చేశారని.. బెదిరించారన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని అదంతా అవాస్తవమని బండి శ్రీనివాసరావు కొట్టిపడేశారు. మమ్మల్ని కంట్రోల్లో ఉండాలని ఆదేశించలేదని చెప్పారు. ఉద్యోగుల సమస్యలు విన్నవించుకునేందుకు తమకు సచివాలయంలో అందుబాటులో ఉండే ఏకైక వ్యక్తి సజ్జలే అని ఆయన అన్నారు.
ప్రెస్మీట్లో ఉన్నప్పుడు సజ్జల ఫోన్లో ఏం మాట్లాడారో శ్రీనివాసరావు వెల్లడించారు. కలిసికట్టుగా పోరాడుతున్నందుకు శుభాకాంక్షలు తెలుపుతూ.. ఈ ప్రభుత్వం ఫ్రెండ్లీగా ఉంటుందని.. ఘర్షణ ధోరణిలో వెళ్లొద్దని సజ్జల సూచించనట్లు బండి తెలిపారు. తమపై కొందరు దుష్ర్పచారం చేస్తున్నారని.. తాము ఏ రాజకీయ పార్టీకి తొత్తులుగా వ్యవహరించబోమని శ్రీనివాస్ తెలిపారు. అవాస్త వార్తలతో తమ బంధాన్ని చెడగొట్టొద్దని విజ్ఞప్తి చేశారు.
సజ్జల తనకు శుభాకాంక్షలు చెప్పేందుకే ఫోన్ చేశారని.. బెదిరించారన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని అదంతా అవాస్తవమని బండి శ్రీనివాసరావు కొట్టిపడేశారు. మమ్మల్ని కంట్రోల్లో ఉండాలని ఆదేశించలేదని చెప్పారు. ఉద్యోగుల సమస్యలు విన్నవించుకునేందుకు తమకు సచివాలయంలో అందుబాటులో ఉండే ఏకైక వ్యక్తి సజ్జలే అని ఆయన అన్నారు.
ప్రెస్మీట్లో ఉన్నప్పుడు సజ్జల ఫోన్లో ఏం మాట్లాడారో శ్రీనివాసరావు వెల్లడించారు. కలిసికట్టుగా పోరాడుతున్నందుకు శుభాకాంక్షలు తెలుపుతూ.. ఈ ప్రభుత్వం ఫ్రెండ్లీగా ఉంటుందని.. ఘర్షణ ధోరణిలో వెళ్లొద్దని సజ్జల సూచించనట్లు బండి తెలిపారు. తమపై కొందరు దుష్ర్పచారం చేస్తున్నారని.. తాము ఏ రాజకీయ పార్టీకి తొత్తులుగా వ్యవహరించబోమని శ్రీనివాస్ తెలిపారు. అవాస్త వార్తలతో తమ బంధాన్ని చెడగొట్టొద్దని విజ్ఞప్తి చేశారు.