యాప్నగరం

పదేళ్ల బాలికపై అత్యాచారం.. గుంటూరులో దారుణం

తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లడంతో పదేళ్ల బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆ సమయంలో ఇంట్లోకి ప్రవేశించి 60 ఏళ్ల వృద్ధుడు బాలికపై అత్యాచారం చేశాడు.

Samayam Telugu 1 May 2020, 12:48 pm
మహిళలు, చిన్నారుల రక్షణకు కఠిన చట్టాలు చేసినా కామాంధుల్లో కనీస భయం కలగడం లేదు. నిత్యం ఎక్కడోచోట అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అభంశుభం తెలియని చిన్నారులపై కామాంధులు అకృత్యాలకు తెగబడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇంట్లో ఒంటరిగా ఉన్న పదేళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన గుంటూరు జిల్లాలో తాజాగా వెలుగుచూసింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


మనవరాలి వయసున్న చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడో కామాంధుడు. కామంతో కళ్లుమూసుకుపోయి పదేళ్ల బలికను రేప్ చేశాడు. ఈ దారుణ ఘటన నాదెండ్ల మండలంలోని ఓ గ్రామంలో జరిగింది. తల్లిదండ్రులు మిర్చి కోతలకు వెళ్లడంతో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇదే అదనుగా భావించిన ప్రకాశరావు(59) బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

Also Read: మానవ మృగాల పైశాచికం.. అన్నని బావిలో తోసేసి.. చెల్లెలిని లాక్కెళ్లి దారుణంగా..

చిరుతిళ్లు కొనిపెడతానని ఆశచూపి బాలికను తన ఇంటికి తీసుకెళ్లి రేప్ చేశాడు. పొలం పనుల నుంచి ఇంటికి తిరిగొచ్చిన తల్లదండ్రులకు విషయం తెలియడంతో వెంటనే పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం నరసరావుపేట ఆస్పత్రికి తరలించారు.

Read Also: అత్త రాసలీలలకి అడ్డొచ్చిన అల్లుడు.. చంపేసిన కూతురు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.