యాప్నగరం

ఇంట్లో ఒంటరిగా పదేళ్ల బాలిక.. గుంటూరు జిల్లాలో దారుణం

తల్లి పొలం పనులకు వెళ్లడంతో బాలిక ఒంటరిగా ఇంట్లో టీవీ చూస్తోంది. అదే అదనుగా భావించిన నిందితుడు బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు.

Samayam Telugu 24 Apr 2020, 5:42 pm
ఎన్ని కఠిన చట్టాలు చేసినా కామాంధులకు భయం కలగడం లేదు. కామంతో కళ్లుమూసుకుపోయి దారుణాలకు తెగబడుతూనే ఉన్నారు. పశువుల్లా మీద పడి అభంశుభం తెలియని చిన్నారుల జీవితాలను చిదిమేస్తున్నారు. పదేళ్ల బాలికపై యాభై ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన అత్యంత దారుణ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


నకరికల్లు మండలం కుంకలగుంట గ్రామానికి చెందిన బాలిక(10)ను దారుణంగా రేప్ చేశాడో కామాంధుడు. తల్లి పొలం వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా టీవీ చూస్తున్న బాలికపై అదే గ్రామానికి చెందిన కొత్తపల్లి మరియానందం(51) కన్నేశాడు. ఇంట్లోకి చొరబడి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారిపై పడి పశువాంఛ తీర్చుకున్నాడు.

Also Read: ‘మెదడు, మనసు నాకు శత్రువులు..’ నెల్లూరు యువకుడి ఆత్మహత్య

పొలం నుంచి ఇంటికి తిరిగొచ్చిన తల్లికి విషయం తెలిసి షాక్‌కి గురైంది. వెంటనే తేరుకుని బిడ్డపై అత్యాచారానికి పాల్పడిన దుర్మార్గుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.