యాప్నగరం

ఆరుబయట నిద్రపోతున్న బాలికపై అత్యాచారం.. హైదరాబాద్‌లో దారుణం

శేరిలింగంపల్లి వాంబే కాలనీకి చెందిన బాలిక గురువారం రాత్రి అమ్మమ్మతో కలిసి ఆరుబయట నిద్రపోయింది. దీన్ని గమనించిన స్థానిక యువకుడు ఆమె నోరు నొక్కేసి అత్యాచారానికి పాల్పడ్డాడు.

Samayam Telugu 30 May 2020, 7:22 am
హైదరాబాద్‌ నగరంలో మరో దారుణ ఘటన జరిగింది. పదేళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. శేరిలింగంపల్లి పాపిరెడ్డి కాలనీ వాంబే నివాస సముదాయాల్లో ఓ పేద కుటుంబం నివాసం ఉంటోంది. ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. కరోనా కారణంగా పని లేకపోవడంతో భార్యాభర్తలు పెద్ద కుమార్తెను తీసుకొని పటాన్‌చెరులోని ఓ పరిశ్రమలో పనిచేయడానికి వెళ్లారు. చిన్న కుమార్తెను అమ్మమ్మ ఇంటి వద్ద దగ్గర ఉంచారు.
Samayam Telugu Image


Also Read: స్నేహితుడి భార్యపైనే కామం.. గదిలో బంధించి రేప్.. ఏలూరులో దారుణం

వేసవి కావడంతో ఉక్క పోస్తుందని గురువారం రాత్రి ఆ బాలిక, అమ్మమ్మతో కలిసి ఆరుబయట పడుకుంది. ఈ విషయాన్ని గమనించిన అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు అర్ధరాత్రి దాటిన తర్వాత బాలిక నోరు మూసేసి అత్యాచారం చేశాడు. అదే సమయంలో అలికిడి కావడంతో పక్కింట్లో ఉండే ఓ వ్యక్తి నిద్రలేచి బయటకు వచ్చాడు. ఇక్కడేం చేస్తున్నావని యువకుడిని ప్రశ్నించగా అతడు పరారయ్యాడు. అపస్మారక స్థితికి చేరుకున్న బాలికను అమ్మమ్మ స్థానికుల సాయంతో ఆస్పత్రికి తరలించింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: అక్రమ సంబంధానికి ఒప్పుకోలేదని మాజీ ప్రియురాలిపై హత్యాయత్నం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.