యాప్నగరం

ప్రకాశంలో దారుణం.. బాలికను పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారం

మీ అమ్మ కరివేపాకు అడిగింది. నాతో వస్తే కోసి ఇస్తానని మాయమాటలు చెప్పి మైనర్ బాలికను పొలానికి తీసుకెళ్లి కామాంధుడు దారుణానికి పాల్పడ్డాడు.

Samayam Telugu 9 Oct 2020, 10:13 am
ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అభం శుభం తెలియని మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడో కామాంధుడు. తల్లి లేని సమయం చూసి బాలికను పొలాల్లోకి తీసుకెళ్లి నీచానికి పాల్పడ్డాడు. కనిగిరి పరిధిలోని వెలిగండ్ల మండలం కంకణపాడులో ఈ దారుణం జరిగింది. గ్రామానికి చెందిన మైనర్ బాలిక(11)పై అదే గ్రామానికి చెందిన రాయళ్ల మాలకొండయ్య కన్నేశాడు. ఆమె తల్లి లేని సమయం చూసి బాలికను పొలానికి తీసుకెళ్లాడు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
rape


తనతో వస్తే కరివేపాకు కోసి ఇస్తానని చెప్పడంతో బాలిక అతని బైక్ ఎక్కి పొలానికి వెళ్లింది. అక్కడికి వెళ్లాక కీచకుడు నీచానికి పాల్పడ్డాడు. మైనర్ బాలికను అమానుషంగా అత్యాచారం చేశాడు. విషయం బయటికి తెలియడంతో గ్రామపెద్దలు బాలిక తల్లికి కొంత నష్టపరిహారం చెల్లించమంటూ రాజీ చేశారు. ఈ దారుణ ఘటన పోలీసులకి తెలియడంతో గ్రామానికి వచ్చి విచారణ జరిపారు. పంచాయితీ చేసిన పెద్దమనుషులను విచారించి నిందితుడిని అరెస్టు చేశారు. పోక్సో తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.

Also Read: కూతురి భర్తను బెల్టుతో ఉరేసిన తండ్రి.. మరో పరువు హత్య కలకలం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.