యాప్నగరం

గుంటూరు జిల్లాలో దారుణం.. పదకొండేళ్ల బాలికపై అత్యాచారం..

పదకొండేళ్ల బాలకపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని స్థానికులు కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్‌కి తీసుకొచ్చిన ఘటన కలకలం రేపింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Samayam Telugu 20 Jan 2020, 5:03 pm
మనవరాలి వయసున్న బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడో మానవమృగం. పదకొండేళ్ల బాలికపై కన్నేసిన కామాంధుడు అత్యంత దారుణంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ అమానవీయ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. డీజీపీ ఆఫీస్‌కి కూతవేటు దూరంలోని మంగళగిరిలో ఈ దారుణం జరగడం గమనార్హం.
Samayam Telugu gang rape 2


మంగళగిరి పట్టణంలోని బాపనయ్య నగర్‌కి చెందిన 55 ఏళ్ల వ్యక్తి 11 సంవత్సరాల బాలికపై అత్యాచారం చేశాడు. మనవరాలి వయసున్న వ్యక్తిపై అఘాయిత్యానికి పాల్పడిన విషయం బయటకు తెలియడంతో అతడిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి అప్పజెప్పారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Also Read: జైలులో భర్త.. ఒంటరిగా ఉన్న భార్యపై పక్కింటివారి పైశాచికత్వం

ఇటీవల గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంటున్న అత్యాచార ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. కొద్దిరోజుల కిందట మైనర్ బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆందోళనలకు దారితీసింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలు నిరసనలు తెలియజేశాయి. ఆ తరువాత కూడా మరికొన్ని అత్యాచార ఘటనలు నమోదయ్యాయి. వరుస అత్యాచారాలతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

Read Also: నీటి కుంటలో తేలిన టైరు.. అనుమానంతో వెతికిన కుటుంబ సభ్యులకు షాక్.. ముగ్గురు చిన్నారులు.!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.