యాప్నగరం

బీరు సీసాతో బెదిరించి 12ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్

రాత్రివేళ బహిర్భూమికి వెళ్లిన బాలికను అక్కడే మద్యం తాగుతున్న ముగ్గురు కామాంధులు చూశారు. ఆమెను బెదిరించి ఒకరి తర్వాత ఒకరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

Samayam Telugu 10 Mar 2020, 10:47 am
తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లా వాణియంబాడి సమీపంలో 12ఏళ్ల బాలికపై ముగ్గురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మేట్టుపాళెయం ప్రాంతానికి చెందిన బాలిక ఆరో తరగతి చదువుతోంది. ఇంట్లో మరుగుదొడ్డి వసతి లేకపోవడంతో ఈ నెల 7వ తేదీ రాత్రి ఇంటి సమీపంలో ఉన్న పాలారు నది ఒడ్డుకు బహిర్భూమికి వెళ్లింది.
Samayam Telugu girl rape


Also read: దంపతుల దారుణ హత్య, భార్యపై అత్యాచారయత్నం?.. 15ఏళ్ల బాలుడు కూడా

ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన చంద్రు, పార్థిభన్‌, కన్నన్‌లు మద్యం తాగుతుండగా బాలిక కనిపించింది. ముగ్గురు యువకులు బాలికను వెంబడించి ముళ్లపొదల్లోకి ఎత్తుకెళ్లి అత్యాచారయత్నానికి ప్రయత్నించగా ఆమె కేకలు వేసింది. దీంతో వారు బీరు సీసా పగులగొట్టి అరిస్తే చంపేస్తామని బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అపస్మాకర స్థితికి చేరుకున్న బాధితురాలిని అక్కడే నగ్నంగా వదిలేసి పరారయ్యారు.

Also read: మచిలీపట్నంలో అర్థరాత్రి ప్రేమజంట కిడ్నాప్.. సినీఫక్కీలో పోలీసుల వేట

కొద్దిసేపటి తర్వాత మేలుకున్న బాలిక శ్మశానంలో కనిపించిన వస్త్రాన్ని కప్పుకుని ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు జరిగిన అఘాయిత్యం గురించి తెలిపింది. దీంతో వారు వెంటనే వాణియంబాడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Also read: 3నెలలకే భర్తకు షాకిచ్చిన భార్య.. బంగారం, నగదుతో పరార్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.