యాప్నగరం

13ఏళ్ల బాలికపై పది రోజులుగా అత్యాచారం.. హైదరాబాద్‌లో మరో దారుణం

పంజాగుట్ట పీఎస్ పరిధిలోని ఎమ్ఎస్ మక్తాలో 13ఏళ్ల బాలికపై ఓ యువకుడు పది రోజులుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ విషయం మంగళవారం గమనించిన బాలిక తల్లిదండ్రులు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Samayam Telugu 29 Jan 2020, 9:40 am
హైదరాబాద్‌ నగరంలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 13ఏళ్ల బాలికపై ఓ కామాంధుడు పది రోజులుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. పంజాగుట్ట పరిధిలోని ఎమ్‌ఎస్ మక్తాలో ప్రాంతంలో నివసించే దంపతులకు 13ఏళ్ల కూతురు ఉంది. తండ్రి వాచ్‌మెన్‌గా పనిచేస్తుండగా, తల్లి ఇళ్లల్లో పనులు చేస్తూ భర్తకు చేదోదువాడోడుగా ఉంటోంది.
Samayam Telugu west


Also Read: రెండో భర్తను బంధించి గోళ్లు పీకేసి.. కిరాతకంగా హత్యచేసిన మహిళా టెక్కీ

దీంతో బాలిక ఎక్కువ సమయం ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. వీరి ఇంటికి సమీపంలోనే నివసించే జహంగీర్(30) అనే వ్యక్తి పంక్చర్ షాపు నడుపుతున్నాడు. బాలికపై కన్నేసిన ఆ కామాంధుడు ఆమె మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. సాయంత్రం వేళ ఆమె తల్లిదండ్రులు లేని సమయం చూసి ఇంట్లోకి వెళ్లి లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. సుమారు పది రోజులుగా ఈ కీచకపర్వం కొనసాగుతోంది.

Also Read: నోట్లో గుడ్డలు కుక్కి యువతిపై రేప్.. ప్రైవేట్ పార్ట్స్‌లో ఐరన్ రాడ్‌తో వికృత చేష్టలు

మంగళవారం సాయంత్రం తల్లిదండ్రులు ఇంటికొచ్చేసరికి బాలిక నీరసంగా పడుకుని ఉంది. ఏం జరిగిందని తల్లి అడగ్గా ఏడుస్తూ అసలు విషయం చెప్పింది. దీంతో తల్లిదండ్రులు పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి జహంగీర్‌‌పై ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Also Read: యువతి శవానికి గర్ల్‌ఫ్రెండ్ బట్టలు, నగలు.. ప్రేమ జంట మాస్టర్ ప్లాన్.. షాకైన పోలీసులు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.