యాప్నగరం

మందలించారని బాలుడి ఆత్మహత్మ.. మచిలీపట్నంలో విషాదం

ఇంట్లోనే ఉంటున్న కొడుకుని పుస్తకం తీసి చదువుకోమంటూ కసురుకోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. క్షణికావేశంలో లోకాన్ని విడిచి తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చాడు.

Samayam Telugu 23 May 2020, 8:22 pm
అమ్మ కొట్టిందని.. తండ్రి తిట్టాడని చిన్నచిన్న విషయాలకే పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. క్షణికావేశంలో బలవన్మరణానికి పాల్పడి కన్నవాళ్లకు కన్నీళ్లు మిగుల్చుతున్నారు. అలాంటి ఘటన ఒకటి తాజాగా ఏపీలోని కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. లాక్‌డౌన్‌తో ఇంటిపట్టునే ఉంటున్న కుమారుడిని పుస్తకం తీయమని తల్లిదండ్రులు మందలించారని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదం నింపింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


పద్నాలుగేళ్ల బాలుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మచిలీపట్నంలోని బ్రహ్మపురంలో జరిగింది. ఇంట్లో ఖాళీగా ఉంటున్న కుమారుడిని చదువుకోమంటూ తల్లిదండ్రులు మందలించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన బాలుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంట్లోనే ఫ్యాన్‌కి ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. కన్నవాళ్లకు తీరని శోకాన్ని మిగిల్చాడు.

Also Read: కొంపముంచిన అమావాస్య.. ముగ్గురి దుర్మరణం.. నిజామాబాద్‌లో విషాదం

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టానికి తరలించారు. సూసైడ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. చదువుకోమన్నందుకు బాలుడు చనిపోయిన ఘటన స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.