యాప్నగరం

ఒంగోలులో ఘోరం.. బాలికను బలవంతంగా లాక్కెళ్లి..

ప్రకాశం జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. బాలికను కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లిన దుండగులు ఆమె అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం ఆమెను టౌన్‌లో వదిలేసి పరారయ్యారు.

Samayam Telugu 24 Jan 2020, 6:23 pm
వివాహితపై సామూహిక అత్యాచారానికి పాల్పడి దారుణంగా హత్య చేసిన ఘటన మరువకముందే ప్రకాశం జిల్లాలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒంగోలులో కామాంధులు మరోమారు రెచ్చిపోయారు. బాలికను కిడ్నాప్ చేసి అఘాయిత్యానికి ఒడిగట్టారు. అనంతరం బాలికను ఒంగోలు టౌన్‌లో విడిచిపెట్టిన ఘటన కలకలం రేపుతోంది.
Samayam Telugu rape2


ప్రకాశం జిల్లా కొత్తపట్నానికి చెందిన పదిహేనేళ్ల బాలికను దుండగులు అపహరించారు. బాలికను కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లారు. బాలికపై బలవంతంగా అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం బాలికను ఒంగోలు పట్టణంలో వదిలేసి దుండగులు పరారైన ఘటన తీవ్ర సంచలనంగా మారింది. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రెండు రోజుల కిందటే మహిళపై సామూహిక హత్యాచార ఘటన జరగడం.. ఆ వెంటనే బాలిక కిడ్నాప్, అత్యాచార ఘటనలతో తీవ్ర కలకలం రేగింది.

Also Read: విద్యార్థినిని ఇంట్లో బంధించి అత్యాచారం.. తూర్పు గోదావరిలో కీచక వార్డెన్

ఒంగోలు నగర శివారులో ఓ మహిళపై సామూహిక హత్యాచార ఘటన వెలుగుచూసిన విషయం తెలిసిందే. మంగళవారం రాత్రి ఓ మహిళ వివస్త్రగా అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న మృతి చెందింది. ఈ దారుణ ఘటన జరిగిన రెండు రోజుల్లోనే మరో ఘటన జరగడం ఆందోళన కలిగిస్తోంది.

Read Also: ఫ్రెండ్స్ ముందు అలా డ్యాన్స్ చేయమంటున్న భర్త.. సినీ నటికి లైంగిక వేధింపులు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.