యాప్నగరం

చెత్త పారేసేందుకు వెళ్లిన బాలిక.. చెరుకుతోటలో దారుణం

ఇంట్లో చెత్తను పారబోసేందుకు వెళ్లిన బాలికను చెరబట్టారు. కామపిశాచాలు ఆమెను బలవంతంగా పొలంలోకి లాక్కెళ్లి పైశాచికానికి తెగబడ్డాయి.

Samayam Telugu 1 Aug 2020, 10:04 pm
మహిళలపై లైంగిక నేరాలకు పాల్పడిన దుర్మార్గులను ఉరితీసినా కామాంధుల్లో కనీస భయం కలగడం లేదు. నిత్యం ఎక్కడో చోట అత్యాచార ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. అభం శుభం తెలియని చిన్నారులను సైతం అమానుషంగా చిదిమేస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అలాంటి దారుణ ఘటన ఒకటి తాజాగా యూపీలో వెలుగుచూసింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
gang rape


ముజఫ్ఫర్‌నగర్‌ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన పదిహేనేళ్ల బాలిక ఇంట్లోని చెత్త పారేసేందుకు డంపింగ్ యార్డు వద్దకు వెళ్లింది. ఒంటరిగా ఉన్న బాలికపై కన్నేసిన కామాంధులు అమాంతం ఆమెను పొలంలోకి లాక్కెళ్లారు. చెరుకుతోటలో పడేసి పశువుల్లా మీద పడి కామవాంఛలు తీర్చుకున్నారు. బాలికపై ముగ్గురు దుర్మార్గులు సామూహిక అత్యాచారం చేశారు. ఆ దారుణాన్ని వీడియోలు తీసి పైశాచికానంద పొందారు.

Also Read: నంద్యాలలో ఘోరం.. బైక్‌ పైనుంచి పడిన యువకుడిని తొక్కేసిన లారీ

బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులపై సామూహిక అత్యాచారం, పోక్సో తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న గౌరవ్‌ని పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Read Also: దొంగబాబా కామక్రీడలు.. కోరిక తీర్చకపోతే చేతబడే.. శ్రీకాళహస్తిలో దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.