యాప్నగరం

బాలిక నమ్మించి లొంగదీసుకుని.. కాకినాడలో ఆటోడ్రైవర్ అఘాయిత్యం

ప్రేమ పేరుతో బాలికకు దగ్గరైన ఆటోడ్రైవర్ దుర్గాప్రసాద్ జనవరి 27న ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Samayam Telugu 2 Feb 2020, 10:57 am
తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడలో ఓ ఆటోడ్రైవర్ కీచకుడి అవతారమెత్తాడు. ప్రేమ పేరుతో బాలికను నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడు. నగరంలోని దుమ్ములపేటకి చెందిన మరుపల్లి దుర్గాప్రసాద్‌(20) అనే యువకుడు ఆటో నడుపుతున్నాడు. తరుచూ తన ఆటో ఎక్కే బాలిక(16)తో మాటలు కలిపి దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఆమె కూడా అతడితో చనువుగా ఉండేది.
Samayam Telugu girl rape


Also read: మహిళను నమ్మించి మద్యం తాగించి.. వికారాబాద్ జిల్లాలో దారుణం

జనవరి 27వ తేదీ బాలికను ఆటోలో ఎక్కించుకుని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లిన దుర్గాప్రసాద్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే పెళ్లి చేసుకోనని బెదిరించి బాలికను ఇంటి దగ్గర వదిలిపెట్టాడు. బాలిక నీరసంగా ఉండటాన్ని గమనించిన తల్లిదండ్రులు ఏం జరిగిందని ఆరా తీయగా అసలు విషయం చెప్పింది. దీంతో వారు కాకినాడ త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని శనివారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాలతో అతడిని రిమాండ్‌కు తరలించారు.

Also read: హైదరాబాద్‌లో కామపిశాచి.. పోర్న్ చిత్రాలు చూపిస్తూ బాలికలపై అఘాయిత్యం

Also read: కన్నకొడుకు కోసం వ్యభిచారం రొంపిలోకి దిగి... దారుణహత్యకు గురైన గుంటూరు మహిళ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.