యాప్నగరం

పెళ్లయిన 17 రోజులకే బిడ్డకు జన్మినిచ్చిన యువతి

గతేడాది ఏప్రిల్ 19న యువతికి వివాహం కాగా.. మే 6వ తేదీన బిడ్డకు జన్మనిచ్చింది. దీనిపై అత్తింటివారు ఆమెను నిలదీయగా అసలు నిజం చెప్పింది. దీంతో కంగుతిన్న వారు పోలీసులకు ఫిర్యాదుచేశారు.

Samayam Telugu 16 Jan 2020, 8:33 am
పెళ్లయిన 17 రోజులకే ఓ యువతి బిడ్డకు జన్మనిచ్చిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావో జిల్లాలో వెలుగుచూసింది. లక్నోలోని బంతారా పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ ప్రాంతానికి చెందిన ఓ యువతికి గతేడాది ఏప్రిల్ 19న ఉన్నావో జిల్లాలోని సదర్ కొత్వాలి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో వివాహమైంది. అయితే పెళ్లయిన 17రోజుల తర్వాత మే 6వ తేదీన ఆమెకు కడుపులో నొప్పులు రావడంతో అత్తింటివారు ఆస్పత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన డాక్టర్లు అది కడుపునొప్పి కాదని పురిటినొప్పులని చెప్పడంతో అంతా షాకయ్యారు. కాసేపటికే ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
Samayam Telugu baby_theft_from_hospital_1


Also Read: ప్రియుడితో కలిసి భర్త దారుణహత్య.. కేసు నుంచి తప్పించుకునేందుకు ఏఎస్‌ఐ‌తోనూ అఫైర్

దీనిపై యువతిని అత్తింటివారు నిలదీయగా తన తండ్రి, సోదరుడితో పాటు 11 మంది తనను బెదిరించి అనేకసార్లు అత్యాచారం చేసినట్లు చెప్పింది. తనకు 13ఏళ్ల వయసు వచ్చినప్పటి నుంచి తండ్రి, సోదరుడు లైంగికంగా అనుభవించేవారని, ఈ విషయం తెలుసుకున్న గ్రామపెద్ద సహా పలువురు వ్యక్తులు తనపై అత్యాచారం చేసేవారని చెప్పింది. దీంతో యువతి అత్తింటివారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఉన్నావో ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు కొద్దిరోజుల క్రితమే వెలుగులోకి వచ్చింది.

Also Read: ప్రియురాలితో గదిలో ఉండగా చూశాడని.. 11ఏళ్ల బాలుడి దారుణహత్య

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.