యాప్నగరం

జాబ్ చేస్తూ ఫోన్ కొనుక్కున్న బాలిక.. అక్కతో గొడవ, ఆత్మహత్య

Hyderabad: సెల్ ఫోన్ కోసం అక్కతో గొడవ పడి ఓ మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన హైదరాబాద్ నగరంలోని కుషాయిగూడలో చోటు చేసుకుంది. స్థానిక కట్టింగ్ కాలనీలో నివాసం ఉంటున్న ఓ మేస్త్రి కుమార్తె (17) ఇంటర్ పూర్తి చేసింది. ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తోంది. ఆమె ఇటీవలే సెల్ ఫోన్ కొనుక్కుంది. ఆ సెల్ ఫోన్‌ను అక్కాచెల్లెళ్లిద్దరూ ఉపయోగిస్తున్నారు. దాని కోసం ఇద్దరూ గొడవపడ్డారు.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 15 Aug 2022, 11:53 pm
ఫోన్ కోసం అక్కతో గొడవ పడి ఓ మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ నగరంలోని కుషాయిగూడలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక కట్టింగ్ కాలనీలో నివాసం ఉంటున్న ఓ మేస్త్రి కుమార్తె (17) ఇంటర్ పూర్తి చేసింది. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఆమె ఇటీవలే సెల్ ఫోన్ కొనుక్కుంది. ఇంట్లో ఉన్న ఒకే ఒక్క సెల్ ఫోన్‌ను అక్కాచెల్లెళ్లిద్దరూ ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం (ఆగస్టు 15) ఆ ఫోన్ విషయమై అక్కాచెల్లెళ్లిద్దరూ ఘర్షణ పడ్డారు. అక్క మందలించడంతో మనస్తాపం చెందిన చెల్లి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. సమాచారం అందుకున్న కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Samayam Telugu Cell phone
ప్రతీకాత్మక చిత్రం


Also Read:

పటాన్‌చెరు: జెండా ఎగరేస్తుండగా కరెంట్ షాక్.. ఇద్దరి మృతి
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.